కల్తీలేని వార్తలు కలకలం రేపే కథనాలు
ఉగ్రదాడిలో మరణించిన కావలి వాసి మధుసూదన్ పార్దివ దేహాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సందర్శించి నివాళులర్పించారు. మధు సూదన్ భార్య కామాక్షి, పిల్లలతో మాట్లాడి ఆయన ధైర్యం చెప్పారు. ఉగ్రవాదులు ఎక్కడున్నా ఏరియాలంటూ పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
మే 2న అమరావతిలో దేశ ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించనున్నారు. పర్యటన ఏర్పాట్లను…రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ అధికారులతో కలిసి సందర్శించారు. ప్రధాని పర్యటనలో ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని ఆయన అధికారుల్ని ఆదేశించారు.
ఉగ్రవాదుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన మధుసూదన్ పార్ధివ దేహాన్ని కలెక్టర్ ఆనంద్, కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి లు సందర్శించి నివాళులు అర్పించారు. మధుసూదన్ భార్య, కుటుంబ సభ్యులతో వారు మాట్లాడి ధైర్యం చెప్పారు.
ఇందుకూరుపేట మండలం కొత్తూరులో జరిగిన షిరిడి సాయిబాబా 17వ వార్షికోత్సవ వేడుకలు వైభవంగా జరిగాయి. ఈ వేడుకల్లో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి పాల్గొని బాబాకి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన పదో తరగతి పరీక్షా ఫలితాల్లో నెల్లూరు నారాయణ విద్యా సంస్థల విద్యార్థులు విజయకేతనం ఎగుర వేశారు. 598 మార్కులు సాధించిన నారాయణ కాన్సెప్ట్ స్కూల్ టాపర్ నిలిచిన విద్యార్థిని గొల్ల దీక్షిత ప్రియ, ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థుల్ని విద్యా సంస్థల జీఎం వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి, స్కూల్ యాజమాన్యం అభినందించారు.
మూలాపేటలోని హిమాలయ విద్యా సంస్థల విద్యార్థులు పది ఫలితాల్లో సత్తా చాటారు. 593 మార్కులు సాధించిన హజీరా మహిన్, 591 మార్కులు సాధించిన పురందేశ్వరి, జోష్య, ఆకాంక్ష, దీక్షితలతోపాటుు ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులందరిని విద్యా సంస్థల డైరెక్టర్ హిమశైలజ, కరస్పాండెంట్ శ్రీధర్ లు ప్రత్యేకంగా అభినందించారు.
వైద్యాధికారుల సూచనలు పాటించి మలేరియా బారిన పడకుండా సురక్షితంగా, ఆరోగ్యగంగా ఉండాలని డీఎంఅండ్ హెచ్ వో డాక్టర్ సుజాత సూచించారు. నెల్లూరులోని డీఎంఅండ్ హెచ్ వో కార్యాలయంలో ఆమె మీడియా సమావేశంలో మాట్లాడారు.
సంగం ఎంపీడీవో కార్యాలయంలో కుట్టు మిషన్ శిక్షణా కేంద్రాన్ని… బీసీ కార్పొరేషన్ ఈడీ నిర్మలాదేవి సందర్శించారు. కుట్టు మిషన్ శిక్షణను మహిళలందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు
కావలి పట్టణానికి గురువారం రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విచ్చేశారు. అభిమాన హీరోని చూసేందుకు అభిమానులు భారీగా తరలి వచ్చారు. తిరుగు ప్రయాణంలో పవన్ కళ్యాణ్ తన కారులో నుంచి అభివాదం చేసుకుంటూ వెళ్ళారు.
ఒరిస్సా నుంచి గంజాయి తెచ్చి నెల్లూరులో అమ్ముతున్న ముఠాను సంతపేట పోలీసులు అరెస్ట్ చేశారని నెల్లూరు టౌన్ డీఎస్పీ సింధుప్రియ తెలిపారు. నిందితుల వద్ద నుంచి రూ. 2.50 లక్షల విలువ చేసే గంజాయిని స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు.