ఎన్‌3న్యూస్ బుల్లెట్స్‌

సంక్షిప్త వార్త మాలిక‌

కావలిలో మధుసూదన్ రావు కు కడసారి కన్నీటి వీడ్కోలు పలికారు. అంతిమ యాత్రలో రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు, అధికారులు, కుటుంబ సభ్యులు పాల్గొని నివాళులర్పించారు. మధుసూదన్ రావు పాడెను మంత్రులు సత్యకుమార్ యాదవ్, నాదెండ్ల మనోహర్ లు మోశారు.

సీఎం చంద్రబాబునాయుడు చెప్పేవన్నీ అబద్ధాలేనని ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి విమర్శించారు. వైసీపీ ప్రభుత్వంలో మద్యం దుకాణాల్లో కేవలం.. క్యాష్ ట్రాన్సాక్షన్స్ మాత్రమే జరిగాయని.. కూటమి ప్రజల్లో అవాస్తవాలను ప్రచారం చేయడం దుర్మార్గమని ఆయన మండిపడ్డారు.

నెల్లూరు నగరం బారకాసు సెంటర్ లో ఇమ్రాన్ మొబిలిటీ షోరూమ్ ప్రారంభోత్సవం అట్టహాసంగా జరిగింది. మదీనా వాచ్ అధినేత ఇంతియాజ్, డిప్యూటీ మేయర్ తహసీన్, మైనార్టీ నాయకులు పాల్గొని షోరూమ్ ని ప్రారంభించి అభినందించారు.

వేసవి తీవ్రత దృష్ట్యా వడదెబ్బ జాగ్రత్తలపై సంగం ఎంపీడీఓ షాలెట్, డాక్టర్ శ్రీనివాసులు రెడ్డి సచివాలయం సిబ్బందితో సమావేశం నిర్వహించారు. వేసవిలో ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై గ్రామాల్లో అవగాహన కల్పించాలని వారు సూచించారు.

సూళ్లూరుపేట హోలీ క్రాస్ సర్కిల్లో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదంలో ఒకరు దుర్మరణం పాలయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

చిత్తూరు జిల్లా చౌడేపల్లి లో విషాదం చోటు చేసుకుంది. కుప్పం నియోజకకవర్గం గుడిపల్లిలో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న లక్ష్మీ ఆత్మహత్యకు పాల్పడింది. ఎస్ఐ ఘటనా స్థలానికి చేరుకొని విచారిస్తున్నారు.

ఉగ్రవాదుల దాడిలో మరణించిన భారత పౌరులకు జనసేన నేతలు తీవ్ర సంతాపం ప్రకటించారు. కలువాయి మండలం బస్టాండ్ ఆవరణలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి కన్నీటి నివాళులర్పించారు.

గూడూరులోని కుందనూరు గ్రామం కనుమరాయకొండపై వెలసి ఉన్న లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో సుదర్శన నరసింహ స్వామి రామానుజాచార్యుల నూతన విగ్రహ ప్రతిష్ట అత్యంత వైభవంగా జరిగింది. అనంతరం గోదాదేవి కళ్యాణాన్ని వేదపండితులు కన్నుల పండువగా నిర్వహించారు.

మే 7న హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ లో అన్నమాచార్య కళాక్షేత్రం పీఠాధిపతులు శ్రీ విజయ శంకర స్వామి ఆధ్వర్యంలో హైందవ భక్తి కళా సమ్మేళనం నిర్వహిస్తున్నామని స్వామిజీ తెలిపారు. భద్రాద్రి జిల్లా ఇల్లందులోని శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో సమ్మేళనం వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు.

దొరవారిసత్రం మండలంలో కలెక్టర్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్ సుడిగాలి పర్యటన జరిపారు. తడ మండలం బీసీ బాలుర వసతి గృహంలో జరుగుతున్న మరమ్మత్తుల పనులను ఆయన తనిఖీ చేశారు. అధికారులు, హాస్టల్ వార్డెన్లకు కలెక్టర్ పలు సూచనలు, సలహాలు చేశారు.

పది ఫలితాల్లో ఇందుకూరుపేట మండలం నరసాపురం ఎంవీఆర్ ఉన్నత పాఠశాల విద్యార్థి గుడి భార్గవ్ 593 మార్కులు సాధించి మండల స్థాయిలో ప్రధమ స్థానంలో నిలిచారు. ముదివర్తిపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థిని ఎస్.కె నేహా ఫర్హత్ 591 మార్కులతో మండలంలో ద్వితీయ స్థానం సాధించారు. విద్యార్థుల్ని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ప్రత్యేకంగా అభినందించి నగదు బహుమతి అందచేశారు.

ఎస్సీ కార్పొరేషన్ రుణాల దరఖాస్తులకు మే 10వతేదీ వరకు అవకాశం ఉందని వాకాడు ఎంపీడీవో శ్రీనివాసులు తెలిపారు. ఈ అవకాశాన్ని ఎస్సీ లబ్ధిదారులందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

ఇందుకూరుపేట మండలం డేవిస్ పేటలో ప్రకృతి వ్యవసాయం ప్రణాళికపై గ్రామ సభ ర్యాలీ నిర్వహించారు. లెవల్ 1 ఇంచార్జి అనూష, ఎల్ సీ ఆర్ పి లు ప్రకృతి వ్యవసాయంపై రైతులు, ప్రజలకు అవగాహన కల్పించారు.

రాపూరు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో భవానీ ఆధ్వర్యంలో పంచాయతీరాజ్ఖ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, సచివాలయ సిబ్బంది చేత ఆమె పంచాయతీరాజ్ ప్రతిజ్ఞ ను చేయించారు.

వింజమూరులోని మండల పరిషత్ కార్యాలయ ప్రాంగణంలో పంచాయతీరాజ్ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొని గాంధీ, అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.

సూళ్లూరుపేట మండల పరిషత్ కార్యాల‌యంలో జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవ వేడుకలను ఘ‌నంగా నిర్వహించారు. పంచాయతీ కార్యదర్శులను, ఇంజనీరింగ్ అసిస్టెంట్ లను అధికారులు ఘ‌నంగా స‌న్మానించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *