బీజేపీ నేతలు డిమాండ్ – నెల్లూరు నగరంలో కొవ్వొత్తుల ర్యాలీ
ఉగ్రవాదుల్ని ఉరి తీయాలి…
- బీజేపీ నేతలు డిమాండ్
- నెల్లూరు నగరంలో కొవ్వొత్తుల ర్యాలీ
జమ్ము కాశ్మీర్ ఉగ్రవాదుల దాడుల్లో మరణించిన వారికి బీజేపీ నేతలు కన్నీటి నివాళులర్పించారు. ఉగ్రవాదుల దాడుల్ని తీవ్రంగా ఖండిస్తూ… భారతీయ జనతా కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శి హర్ష వర్ధన్ ఆధ్వర్యంలో నగరంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ దారుణానికి పాల్పడ్డ ముష్కరులను వెంటనే ఉరి తీయాలంటూ డిమాండ్ చేశారు. వందే మాతరం…వందే మాతరం అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా బీజేపీ నేతలు మిడతల రమేష్, బయ్యా వాసు, కందికట్ల రాజేశ్వరమ్మ మాట్లాడారు. పార్టీలకు అతీతంగా, భిన్నత్వంలో ఏకత్వంతో, భారతీయులంతా ఒక్కతాటిపైకొచ్చి ఉగ్రవాదాన్ని పారదోలాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో న్యాయవాది రంగరాజన్, సాంబశివారెడ్డి, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.