పహల్గాం ఉగ్రదాడిలో అశువులుబాసిన కావలి వాసి మధుసూధన్ రావు
వారి కుటుంబాన్ని కలిసిన మాజీ డీఆర్డీఓ ఛైర్మెన్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ
ప్రత్యేక సలహాదారు డాక్టర్ జి సతీష్ రెడ్డి
అందరివాడిగా ఎదిగి అమరుడయ్యాడు…
- మధుసూదన్ పార్థీవదేహానికి కలెక్టర్, ఎమ్మెల్యే నివాళులు
- కావలి పట్టణం ఆనాలవారి వీధిలోని వారి నివాసంలో ఉంచిన మధుసూదన్ పార్ధివ దేహం
- సందర్శించి, నివాళులు అర్పించిన కలెక్టర్ ఆనంద్, కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి
- భార్య, పిల్లలకు ఓదార్పు, ఉగ్రదాడిపట్ల విచారం వ్యక్తం
జమ్మూ కాశ్మీర్ లోని పహల్గాం పర్యాటక ప్రాంతంలో ఉగ్రవాదుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన కావలి పట్టణానికి చెందిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ సోమిశెట్టి మధుసూదన్ మృతదేహాన్ని జిల్లా కలెక్టర్ ఆనంద్, కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి లు సందర్శించి నివాళులు అర్పించారు. కలెక్టర్ , ఎమ్మెల్యే మధుసూదన్ భార్య కామాక్షితో ప్రత్యేకంగా మాట్లాడారు. వారిని ఓదార్చి, సానుభూతి తెలిపారు. జరిగిన ఘటన తీరును, వారు అనుభవించిన హృదయవిదాకర పరిస్థితులు ఆమె తెలపగా అందరి కళ్ళు చెమర్చాయి. అంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. మధుసూదన్ వారి కుటుంబ సభ్యుల్లో, బంధువర్గంలో ఒక్కడే ఉన్నత స్థితికి చేరాడన్నారు. తనతోపాటు బంధువుల్లో వారికి ఎంతో తోడ్పాటుగా ఉండేవాడన్నారు. ఇలా అందరివాడిగా అమరుడాయ్యాడని తెలిపారు. ఉగ్రవాదులను భారత ప్రభుత్వం ఉపేక్షించదని, ప్రజలు ఇలాంటి ఘటనల ప్రభుత్వానికి మద్దతుగా నిలవాలని కోరారు