100 శాతం సాధించిన వీపీఆర్

నిరుపేద విద్యార్థిని గాయత్రికి 587 మార్కులు

పది ఫలితాల్లో విపిఆర్‌ విద్య ప్రభంజనం

100 శాతం సాధించిన వీపీఆర్…

  • నిరుపేద విద్యార్థిని గాయత్రికి 587 మార్కులు
  • పది ఫలితాల్లో విపిఆర్‌ విద్య ప్రభంజనం

నెల్లూరు పార్లమెంట్‌ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి మానసపుత్రిక, విపిఆర్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో అంతర్జాతీయ ప్రమాణాలతో నడుస్తున్న విపిఆర్‌ విద్య పాఠశాల విద్యార్థులు పదో తరగతి ఫలితాల్లో ప్రభంజనం సృష్టించారు. బుధవారం విడుదల చేసిన ఫలితాల్లో పాఠశాల విద్యార్థులు 100కు 100 శాతం ఉత్తీర్ణత సాధించారు. అందులో పి. గాయత్రి అనే విద్యార్థిని 600కు 587 మార్కులు సాధించి టాప్‌లో నిలిచింది. తర్వాత వి.వైష్ణవి 584 మార్కులు, వి.వర్ష 581 మార్కులు సాధించారు. పదో తరగతిలో ఫలితాల్లో మొత్తం 29 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా..29 మంది ఉత్తీర్ణత సాధించారు. వారిలో 27 మంది విద్యార్థులు 500పైగా మార్కులు సాధించడం విశేషం. ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులందరిని వీపీఆర్ దంపతులు, స్కూల్ అధ్యాపకులు ప్రత్యేకంగా అభినందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *