స్కూల్ టాపర్ గా నిలిచిన విద్యార్థి ఖ్యాతిలక్ష్మి
ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థుల్ని అభినందించిన యాజమాన్యం
ఎంతో గర్వంగా ఉంది – ప్రిన్సిపాల్ రఘురాం_
విశ్వసాయి డాక్టర్ ఎస్ఆర్ కే @ 595
- స్కూల్ టాపర్ గా నిలిచిన విద్యార్థి ఖ్యాతిలక్ష్మి
- ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థుల్ని అభినందించిన యాజమాన్యం
- ఎంతో గర్వంగా ఉంది – ప్రిన్సిపాల్ రఘురాం
రాష్ట్ర ప్రభుత్వం బుధవారం విడుదల చేసిన పదో తరగతి పరీక్షా ఫలితాల్లో… నెల్లూరులోని విశ్వసాయి డాక్టర్ ఎస్ ఆర్ కే స్కూల్ విద్యార్థులు సత్తా చాటారని…స్కూల్ ప్రిన్సిపాల్ రఘురాం సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా స్కూల్ ప్రాంగణంలో అభినందన సభ ఏర్పాటు చేసి…ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థుల్ని యాజమాన్యం ప్రత్యేకంగా అభినందించి స్వీట్లు పంచి పెట్టారు. స్కూల్ ఎదుట బాణాసంచా పేల్చి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం ప్రిన్సిపాల్ ఎన్ 3 న్యూస్ తో మాట్లాడారు. పది ఫలితాల్లో ఖ్యాతిలక్ష్మి విద్యార్థిని 595 మార్కులు సాధించడం ఎంతో గర్వంగా ఉందన్నారు. ముఖ్యంగా నూటికి నూటికి నూరు శాతం ఉత్తీర్ణత సాధించడం గొప్ప విషయమన్నారు. కార్యక్రమంలో చైర్మన్ డాక్టర్ సత్యనారాయణ, డైరెక్టర్లు కృష్ణ మోహన్, శివశంకేత్ వారి ప్రోత్సాహం, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు సహకారంతోనే ఇంతటి ఘన విజయాన్ని సాధించామని తెలిపారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.