45వ డివిజన్ లో చలివేంద్రాన్ని ఏర్పాటు చేసిన డాక్టర్ పోకల రవి
చలివేంద్రాన్ని ప్రారంభించిన కార్పొరేషన్ కమిషనర్ వైవో నందన్,
నారాయణ విద్యా సంస్థల జీఎం వేమిరెడ్డి
మంత్రి నారాయణ ఆదేశాలతో చలివేంద్రం ఏర్పాటు
- 45వ డివిజన్ లో చలివేంద్రాన్ని ఏర్పాటు చేసిన డాక్టర్ పోకల రవి
- చలివేంద్రాన్ని ప్రారంభించిన కార్పొరేషన్ కమిషనర్ వైవో నందన్, నారాయణ విద్యా సంస్థల జీఎం వేమిరెడ్డి
వేసవి తాపం అత్యధికమౌతున్న నేపథ్యంలో ప్రజలకు ఉపశమనం కలిగించేందుకు చలివేంద్రాలు ఎంతగానో దోహదపడతాయని నెల్లూరు నగర పాలక సంస్థ కమిషనర్ వై.ఓ.నందన్ పేర్కొన్నారు. రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ పిలుపుమేరకు నగరంలోని 45వ డివిజన్ నందు డాక్టర్ పోకల రవి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మజ్జిగ, శీతల పానీయాల చలివేంద్రాలను.. నారాయణ విద్యాసంస్థల జనరల్ మేనేజర్ వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి తో ఆయన కలసి ప్రారంభించారు. గతంలో ఎన్నడూ లేని రీతిలో ప్రభుత్వ సహకారం, దాతల సహకారాలతో నెల్లూరు నగరంలోని అన్ని డివిజన్ లలో చలివేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. అనంతరం విజయభాస్కర్ రెడ్డి మాట్లాడుతూ…వేసవి కాలంలో ప్రజల కోసం చలివేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయమని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ సీనియర్ నాయకులు బెల్లపు సుధా మాధవ్, బిజెపి నేత ఇండ్ల రాఘవేంద్రరావు, కూటమి పార్టీల నేతలు పాల్గొన్నారు.