596 మార్కులు సాధించి స్కూల్ టాపర్ గా నిలిచిన వాకాటి మనస్వి
ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థుల్ని అభినందించిన విద్యా సంస్థల చైర్మన్ వేణు, అధ్యాపకులు
పదిలో ఓవెల్ ప్రభంజనం…
- 596 మార్కులు సాధించి స్కూల్ టాపర్ గా నిలిచిన వాకాటి మనస్వి
- ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థుల్ని అభినందించిన విద్యా సంస్థల చైర్మన్ వేణు, అధ్యాపకులు
రాష్ట్ర ప్రభుత్వవం బుధవారం విడుదల చేసిన పదో తరగతి పరీక్షా ఫలితాల్లో… నెల్లూరు నగరంలోని ఓవెల్ విద్యా సంస్థల విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. వాకాటి మనస్వి 600 మార్కులకు గాను, 596 మార్కులు సాధించి…స్కూల్ టాపర్ గా నిలిచిందని విద్యా సంస్థల గ్రూప్ చైర్మన్ ఆర్ వేణు తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రాంగణంలో అభినందన ఏర్పాటు చేశారు. ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థుల్ని చైర్మన్, నిర్వాహకులు, అధ్యాపకులు, తోటి విద్యార్థులు ప్రత్యేకంగా అభినందించారు. చైర్మన్ వేణు మీడియాతో మాట్లాడుతూ… ప్రతీ విద్యార్థికి పదో తరగతి తొలి పరీక్ష తొలి ప్రతిభా పట్టా తొలి మధుర జ్క్షాపకమని తెలిపారు. గురువు, విద్యార్థి తల్లిదండ్రుల సమిష్టి కృషి, ప్రోత్సాహం వల్లే ఇంతటి ఘన విజయాన్ని సాధించామని ఆనందం వ్యక్తం చేశారు. భవిష్యత్ లో మంచి ర్యాంకులు సాధించి జిల్లాకి, తల్లిదండ్రులకి గొప్ప పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. అనంతరం ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులు తమ సంతోషాన్ని పంచుకున్నారు. కార్యక్రమంలో సీఈవో ప్రమీల, జీఎం మహదేవయ్య, ఈడీ బాలు, ప్రిన్సిపాళ్లు, ఏజీఎంలు, ఇన్చార్జిలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.