VKC ని ఘనంగా సన్మానించిన ఉపాధ్యాయులు
ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు VKC అభినందనలు
- VKC ని ఘనంగా సన్మానించిన ఉపాధ్యాయులు
నెల్లూరు జిల్లా చేజర్ల మండలంలోని నాగుల వెల్లటూరు జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాసి ఉత్తమ మార్కులు సాధించినందుకు వారిని సోమశిల ప్రాజెక్టు చైర్మన్ వేలూరు కేశవ చౌదరి అభినందించారు. అదే విధంగా పాఠశాల ఉపాధ్యాయులకు కూడా అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా పాఠశాలకు విచ్చేసిన వేలూరిని శాలువాతో ఉపాధ్యాయులు ఘనంగా సన్మానించారు. అనంతరం కేశవ చౌదరి మాట్లాడుతూ.. ప్రతి ఏడాది కూడా ఇలాగే మంచి ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు.