బారాషహీద్ దర్గా రూరల్ లో ఉండడం నా అదృష్టం
రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి
సీఎం చంద్రబాబుకి బారాషహీద్ దర్గాపై ప్రత్యేకమైన గౌరవం…
- బారాషహీద్ దర్గా రూరల్ లో ఉండడం నా అదృష్టం…
- రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకి బారాషహీద్ దర్గాపై ప్రత్యేకమైన గౌరవం ఉందని…నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గం పరిధిలో బారాషహీద్ దర్గాలో 85 లక్షల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న బారాషహీద్ దర్గా ముఖద్వారాలను ముుస్లిం సోదరులు, మత పెద్దలతో కలిసి ఆయన పరిశీలించారు. పనుల్లో తప్పని సరిగా నాణ్యతా ప్రమాణాలు పాటించాలని సూచించారు. ఈ సందర్భంగా శ్రీధర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ… ముస్లిం పెద్దల సలహాలు, సూచనలతోనే బారాషహీద్ దర్గాలో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. బారాషహీద్ దర్గా అభివృద్ధి కోసం గత 11 సంవత్సరాలుగా నా శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నానని గుర్తు చేశారు. అనంతరం మైనార్టీ నేత సమీ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మత పెద్దలు మరియు ముస్లిం నాయకులు తదితరులు పాల్గొన్నారు.