ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి
కమ్యూనిటీ మొబిలైజర్స్ సమావేశంలో కలెక్టర్ ఆనంద్ తో కలిసి పాల్గొన్న ఎమ్మెల్యే
సంపూర్ణ అక్షరాస్యత దిశగా కోవూరు
- ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి
- కమ్యూనిటీ మొబిలైజర్స్ సమావేశంలో కలెక్టర్ ఆనంద్ తో కలిసి పాల్గొన్న ఎమ్మెల్యే
సంపూర్ణ అక్షరాస్యత ద్వారానే సామాజిక మార్పు సాధ్యమని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి తెలిపారు. కోవూరు గ్రామంలోని ఐసిడిఎస్ కార్యాలయంలో జిల్లా వయోజన విద్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కమ్యూనిటి మొబిలైజర్స్ సమావేశంలో జిల్లా కలెక్టర్ ఆనంద్ గారితో కలిసి ఆమె ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. కలెక్టర్ తో కలిసి ఆమె జ్యోతి ప్రజ్వలన చేశారు. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి మాట్లాడుతూ… నిరక్షరాస్యత నిర్మూలన కార్యక్రమాన్ని చదువుకున్న ప్రతి ఒక్కరు సామాజిక బాధ్యతగా స్వీకరించాలని పిలుపునిచ్చారు. అక్షరాస్యత అనేది అభివృద్ధికి సూచిక లాంటిదన్నారు. కోవూరు నియోజకవర్గంలో 15 సంవత్సరాలు పై బడ్డ వారిలో దాదాపు 22 వేల మంది నిరక్షరాస్యులు వున్నారన్న విషయం ఆశ్చర్యానికి గురి చేసిందన్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడారు. ఎంపి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిల సహాయ సహకారాల కారణంగానే సంపూర్ణ అక్షరాస్యత కార్యక్రమాన్ని కోవూరు నియోజకవర్గం నుంచి శ్రీకారం చుట్టామన్నారు. నిరక్షరాస్యులైన వయోజనులు గుర్తించి వారికి విద్యా బోధన చేయడంలో మొబిలైజర్ల పాత్ర కీలకమన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈవో విద్యారమ, డ్వామాపిడి గంగాభవాని, డీఈఓ, తాసిల్దార్, ఎంపీడీవో, మండల స్థాయి అధికారులు, అక్షరాస్యత వాలంటీర్లు, టిడిపి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు…