మీడియా సమావేశంలో సంగం సీఐ వేమారెడ్డి
వేసవిలో పిల్లల పట్ల తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలి
- మీడియా సమావేశంలో సంగం సీఐ వేమారెడ్డి
నెల్లూరు జిల్లా సంగం సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో సీఐ వేమారెడ్డి మీడియాతో మాట్లాడారు. వేసవి సెలవులు వస్తున్న నేపథ్యంలో తల్లిదండ్రులు తమ పిల్లలను ఈత సరదాలతో కాలువల వద్దకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అదేవిధంగా తల్లిదండ్రులు సెలవుల్లో తమ పిల్లలకు ఒంటరిగా వాహనాలు ఇవ్వకుండా.. ప్రమాదాల నివారణకు సహకరించాలని కోరారు. వేసవిలో చోరీల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గ్రామాలలో గుర్తుతెలియని వ్యక్తులు సంచరిస్తే పోలీస్ లకు సమాచారం అందించాలని తెలియచేశారు.