హత్య కేసులో నిందితులు అరెస్ట్
మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన టౌన్ డీఎస్పీ సింధుప్రియ
మద్యం తాగేందుకు డబ్బులివ్వలేదని…
- హత్య కేసులో నిందితులు అరెస్ట్
- మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన టౌన్ డీఎస్పీ సింధుప్రియ
జాకీర్ హుస్సేన్ నగర్ వద్ద పెన్నానదిలో జరిగిన హత్య కేసును…నవాబుపేట పోలీసులు చేధించారు. ఈ కేసులో ఇద్దరు నిందితుల్ని అరెస్ట్ చేశారు. ఈ మేరకు…నగరంలోని టౌన్ డీఎస్పీ కార్యాలయంలో డీఎస్పీ సింధుప్రియ నిందితుల్ని మీడియా ఎదుట హాజరుపరచి…కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వలేదనే షేక్ సుల్తాన్ ని…షేక్ సలీం, యమల నాగరాజులు కర్రలతో దాడి చేసి కొట్టి చంపినట్లు విచారణలో వెల్లడైందన్నారు. ఈ కేసులో ముద్దాయిలను అరెస్ట్ చేయడంతోపాటు…హత్యకు ఉపయోగించిన కర్రను స్వాధీనం చేసుకుని…రిమాండ్కు తరలించడం జరిగిందన్నారు. కేసును చేధించడంలో ప్రతిభ చూపిన పోలీసులు, సిబ్బందిని ఎస్సీ, డీఎస్పీలు ప్రత్యేకంగా అభినందించారు.