ఐదు రోజులుగా శాంతియుత నిరసన చేస్తున్నా పట్టించుకోవడం లేదని ఆవేదన
న్యాయం కోసం పోరాటం…
- ఐదు రోజులుగా శాంతియుత నిరసన చేస్తున్నా పట్టించుకోవడం లేదని ఆవేదన
నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండలం చింతోపు గ్రామానికి చెందిన లేబూరు మల్లికార్జున్ అనే వ్యక్తి వల్ల మోసపోయామని ఇందుకూరుపేట కొత్తూరు గ్రామానికి చెందిన బాధిత కుటుంబ సభ్యులు చేపట్టిన నిరసన ఐదో రోజుకి చేరింది. గండవరం అనీల్, సంధ్యలు తమ కుటుంబ సభ్యులతోకలిసి మల్లి్కార్జున నివాసం ఎదుట శాంతియుత నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ…తమకు అన్యాయం జరిగిందని…న్యాయం చేయాలని ఐదు రోజుల నుంచి నిరసన చేస్తున్నా అధికారులు పట్టించుకోకపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు.