కల్తీ లేని వార్తలు కలకలం రేపే కథనాలు
కోవూరులోని ఐసీడీఎస్ కార్యాలయంలో కమ్యూనిటీ మొబిలైర్స్ సమావేశం జరిగింది. సమావేశానికి ముఖ్య అతిధులుగా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, కలెక్టర్ ఆనంద్ లు పాల్గొన్నారు. ఆమె కలెక్టర్ తో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. నిరక్షరాస్యత నిర్మూలన కార్యక్రమాన్ని చదువుకున్న ప్రతి ఒక్కరు సామాజిక బాధ్యతగా స్వీకరించాలని వారు పిలుపునిచ్చారు.
బారాషహీద్ దర్గాలో జరుగుతున్న దర్గా ముఖ ద్వారాల నిర్మాణ పనులను రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పరిశీలించారు. పనుల్లో తప్పని సరిగా నాణ్యతా ప్రమాణాలు పాటించాలని ఆయన అధికారుల్ని ఆదేశించారు.
వాకాడులో ఈనెల 23వతేదీన శ్రీయ ఇన్ఫ్రా డెవలపర్స్ వేద ఇటర్నియా మెగా లాంచింగ్ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నామని… డెవలపర్స్ చైర్మన్ కే బాబు అగస్టన్ తెలిపారు. కార్యక్రమానికి ఆస్కార్ గ్రహీత, సినీరచయిత చంద్రబోస్, ప్రముఖ సినీనటులు విచ్చేస్తున్నారని ఆయన చెప్పారు.
తిరుమలలోని కళ్యాణ కట్ట వద్ద మహిళా ఉద్యోగునీలు నిలువు దోపిడీ చేస్తున్నారని భక్తులు ఆవేదన వ్యక్తం చేశారు. వంద రూపాయాలు ఇస్తేనే…గుండు చేస్తామని వారు డిమాండ్ చేస్తున్నారని వాపోయారు. అధికారులు వెంటనే స్పందించి ఉద్యోగులపై చర్యలు తీసుకోవాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు.
భవన నిర్మాణ కార్మికుల పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చిన్నచూపు చూస్తున్నాయని కార్మిక సంఘం నాయకులు మండిపడ్డారు. ఇందుకు నిరసనగా ఈనెల 24వతేదీన గాంధీబొమ్మ నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ చేపడుతున్నామని వారు మీడియా సమావేశంలో తెలిపారు.
వెంకటగిరిలోని నారాయణ స్కూల్ లో గ్రాడ్యుయేషన్ డే ని స్కూల్ యాజమాన్యంగా ఘనంగా నిర్వహించింది. చిన్నారులు చేసిన ఆట పాటలు అందరిని అలరించాయి. కార్యక్రమానికి సీఐ ఏవీ రమణ విచ్చేసి విద్యార్థులు, తల్లిదండ్రులకి పలు సూచనలు, సలహాలు చేశారు.
ఎస్పీ ఆదేశాల మేరకు…టౌన్ డీఎస్పీ సింధుప్రియ ఆధ్వర్యంలో నెల్లూరు నగరం భగత్ సింగ్ కాలనీలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సెర్చ్ లో 54 బైకులు, నాలుగు ఆటోలు, రెండు కార్లు స్వాధీనం చేసుకోవడంతోపాటు…వేలిముద్రల సేకరణ ద్వారా నలుగురు పాత నేరస్తుల్ని గుర్తించామని డీఎస్పీ తెలిపారు.
రేణిగుంటలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ట్రాక్టర్ ని తప్పించబోయి ఓ కంపెనీ బస్సు బోల్తా పడింది. ప్రమాదంలో పలువురు ఉద్యోగులకి తీవ్ర గాయాలు కాగా, మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలియజేశారు.
వేసవిలో తమ పిల్లల పట్ల తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని సంగం సీఐ వేమారెడ్డి సూచించారు. స్థానిక సర్కిల్ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు.
తోటపల్లిగూడూరులోని పొలాల్లో ఉన్న కరెంటు మోటార్ల దొంగతనానికి పాల్పడుతున్న ముగ్గురు నిందితుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ. 5 లక్షల విలువ చేసే 25 మోటార్లను స్వాధీనం చేసుకున్నట్లు అడిషనల్ ఎస్పీ సీహెచ్ సౌజన్య మీడియా సమావేశంలో తెలియజేశారు.