రూ. 5 లక్షల విలువైన 25 మోటార్లు స్వాధీనం
మీడియా సమావేశంలో అడిషనల్ ఎస్పీ సీహెచ్ సౌజన్య
కరెంటు మోటార్ల దొంగలు అరెస్ట్…
- రూ. 5 లక్షల విలువైన 25 మోటార్లు స్వాధీనం
- మీడియా సమావేశంలో అడిషనల్ ఎస్పీ సీహెచ్ సౌజన్య
నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండల పరిధిలోని పొలాల్లో ఉన్న కరెంటు మోటర్లు తరచుగా దొంగతనాలకి పాల్పడుతున్న కత్తుల గోపి, పొట్లూరు పూర్ణచంద్రరావు, చౌటూరు శీను లను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి రూ. 5 లక్షల విలువ చేసే 25 మోటార్లను స్వాధీనం చేసుకున్నట్లు అడిషనల్ ఎస్పీ సీహెచ్ సౌజన్య తెలిపారు. ఈ మేరకు టీపీగూడూరు పోలీసుస్టేషన్ లో ఆమె మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. నిందితులు కొడవలూరు మండలం నార్త్ రాజుపాలెం గ్రామానికి చెందిన వారిగా గుర్తించామన్నారు. వేసవికాలం సెలవుల కారణంగా బయట ఊర్లకు వెళ్లే వారు పోలీస్ స్టేషన్కు సమాచారం అందించి దొంగతనాలు జరగకుండా సహకరించాలని కోరారు. మోటార్ల కేసును చేధించడానికి సహరించిన పోలీసు బృందానికి sp కృష్ణ కాంత్ నగదు రివార్డులు అందజేశారు. రికవరీ చేసిన మోటార్లను పరిశీలించి బాధితులను వివరాలు అడిగి తెలుసుకున్నారు