సంక్షిప్త వార్త మాలిక
నెల్లూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన పెంచలకోన క్షేత్రంలో మే 8 నుంచి 14వ తేదీ వరకు జరిగే శ్రీవారి బ్రహ్మోత్సవాలపై నెల్లూరు ఆర్డీవో కీలక సమీక్ష నిర్వహించారు. అధికారులందరూ సమన్వయంతో పని చేసి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని ఆమె సూచించారు.
సూళ్లూరుపేట పట్టణంలో పేరుకే చలివేంద్రాలు ఉన్నాయని..వాటి పర్యవేక్షణ పూర్తిగా కరువైందని ప్రజలు వాపోయారు. మూడు, నాలుగు రోజులకోసారి మాత్రమే వాటిలో నీళ్లు పోస్తున్నారన్నారు. అధికారులు స్పందించి చలివేంద్రాల్లో నీటిని ఉండేలా చూడాలని కోరుతున్నారు.
ముత్తుకూరు మండలం పుంజులూరుపాడులో నూతనంగా నిర్మించిన అయ్యప్పస్వామి ఆలయంలో మండల పూజలు అత్యంత వైభవంగా జరిగాయి. అయ్యప్పకు శాస్త్రోక్తంగా అభిషేకాలు, పడిపూజను కన్నుల పండువగా నిర్వహించారు. స్వామియే శరణమయ్యప్ప భక్తుల నామస్మరణలతో ఆలయం మారుమోగింది.
నెల్లూరు నగరం విరాట్ నగర్లోని శ్రీ కృష్ణ స్కూల్ ఇంగ్లీషు మీడియం స్కూల్ 20 వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. విద్యార్థినీ విద్యార్థులు చేసిన రామాయణం స్కిట్, సాంస్కృతిక కార్యక్రమాలు అందరిని అలరించాయి.
నెల్లూరు నగరంలో టీడీపీ సీనియర్ నేత కప్పిర శ్రీనివాసులు జన్మదిన వేడుకలను పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. ఆయన చేత భారీ కేక్ కటింగ్ చేయించి…జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
తోటపల్లిగూడూరు మండలం చింతోపు గ్రామానికి చెందిన లేబూరు మల్లికార్జున ఇంటి వద్ద బాధితులు చేపట్టిన నిరసన మంగళవారానికి ఐదో రోజుకి చేరింది. వెంటనే అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని వారు వేడుకుంటున్నారు.
వెంకటాచలం మండలం స్వర్ణ భారత్ ట్రస్టులో ఉన్న ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రిలో కంటి శుక్లం శస్త్ర చికిత్సను వైద్యులు విజయవంతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు.
కోట మండల పరిషత్ కార్యాలయం వద్ద వరల్డ్ ఎర్త్ డేని ఏఆర్డీ స్వచ్ఛంధ సేవా సంస్థ నిర్వాహకులు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు
టీడీపీ మాజీ ఎన్డీసీసీ చైర్మన్ నల్లపురెడ్డి జగన్మోహన్ రెడ్డితో కలిసి కార్యాలయ ప్రాంగణంలో మొక్కలు నాటారు
తన పొలంలో టెంకాయలు కోయనీయకుండా కొందరు అడ్డుకుని తమపై దాడి చేశారని గంగపట్నం గ్రామానికి చెందిన రైతు కాజా రంతుల్లా తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. వారి వల్ల తమకు ప్రాణ హాని ఉంది..రక్షణ కల్పించాలని పోలీసుల్ని వేడుకున్నారు.
ముత్తుకూరులోని NVK ఇంగ్లీష్ మీడియం స్కూల్ లో గ్రాడ్యుయేషన్ డే వేడుకలను… ప్రిన్సిపాల్ మురళీకృష్ణ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకి సర్టిఫికేట్లు, మెడల్స్ అందచేసి అభినందించారు.
సూళ్లూరుపేట టోల్ గేట్ వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. విజయవాడ నుండి చెన్నైకి కారులో వెళ్తున్న టి.కృష్ణచంద్ దంపతులు టోల్ గేట్ సమీపంలో జాతీయ రహదారిపై ఆగి ఉన్న ట్రాక్టర్ ను అతి వేగంతో కారు ఢీ కొట్టారు. ప్రమాదంలో భార్యాభర్తలతోపాటు ట్రాక్టర్ తీవ్ర గాయాలయ్యాయని ఎస్ఐ అజయ్ తెలిపారు.