ఆన్ లైనేస్తున్నారు జనం జరభద్రం

టెక్నాలజీకి అనుగుణంగానే సైబర్ నేరాలు

సైబర్ నేరగాళ్లు కొత్త పద్దతులను ఎంచుకుంటున్నారు

సోషల్ మీడియా నేడు విపరీతంగా విస్తరించింది

ఆన్ లైనేశారు

జనం జరభధ్రం

నకిలీ ఫోటోలు.. డీపీలు.. నకిలీ వాట్స్అప్ అకౌంట్లతో సైబర్ నేరగాళ్లు దోపిడీకి తెగబడుతున్నారు.. పలు శాఖల ఉన్నతాధికారుల ఫోటోలతో వాట్స్అప్ ఖాతాలు తెరిచి కిందిస్థాయి ఉద్యోగులకు మెసేజ్లు పంపుతున్నారు.. ఐయాం మీటింగ్ ఐ నీడ్ మనీ అర్జంట్.. ఐ విల్ యు లేటర్ అని మెసేజ్లు పంపి అందిన కాడికి దోచుకుంటున్నారు.. పెరుగుతున్న టెక్నాలజీకి అనుగుణంగానే సైబర్ నేరాలు కూడా విపరీతంగా పెరిగిపోతున్నాయి. వివిధ రకాల పద్దతులను పాటించి నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. చదువుకోలేని వారితో పాటు విద్యావంతులు, వ్యాపారస్తులు, సెలబ్రిటీలు, ఉన్నతాధికారులు, సంపన్నులు కూడా వీరి వలలో పడి సొమ్ములను పోగొట్టుకుంటున్నారు. మోసాలు చేయడానికి సైబర్ నేరగాళ్లు కొత్త పద్దతులను ఎంచుకుంటున్నారు.
మోసాన్ని బాధితుడు పసిగట్టేలోపుగానే డబ్బులను స్వాహా చేస్తారు. నకిలీ వెబ్ సైట్లు రూపొందించి, ప్రజలను మోసం చేస్తున్నారు.

ఆధార్ కార్డును హ్యాక్ చేసి మోసాలకు పాల్పడేవారు ఇటీవల పెరిగారు. సాధారణంగా ఆధార్ నంబర్ ద్వారా ప్రాథమిక బ్యాంకింగ్ లావాదేవీలు చేయవచ్చు. దీన్నే ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ (ఏఈపీఎస్) అంటారు. దీని ద్వారా బాధితుడి బయో మెట్రిక్ సమాచారాన్ని హ్యాక్ చేసి మోసాలకు పాల్పడుతున్నారు.

సోషల్ మీడియా నేడు విపరీతంగా విస్తరించింది. ప్రతి ఒక్కరూ దీన్ని వినియోగిస్తున్నారు. ముందుగా స్కామర్లు నకిలీ ఖాతాలను తయారు చేస్తారు. మోసం చేయాలనుకునే వ్కక్తికి తెలిసిన వారు, బంధువుల ఫొటోలను వాటికి యాడ్ చేస్తారు. అత్యవసరంగా డబ్బు అవసరమైందంటూ చాట్ చేస్తారు. తమ స్నేహితులు, బంధువులే కదా అని చాాలామంది డబ్బులను పంపించి మోసపోతున్నారు.

ఇలాంటి మోసాల భారిన పడకుండా ఉండటానికి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అనుమతి లేకుండా ఏఈపీఎస్ లావాదేవీలను నివారించడానికి ఆధార్ బయోమెట్రిక్ లను లాక్ చేయాలి. మీ స్టాఫ్ వేర్ ను ఇన్ స్టాల్ చేయాలని, ఏదైనా యాప్ ను డౌన్ లోడ్ చేయాలని వచ్చిన అభ్యర్థనలను పట్టించుకోకూడదు. చెల్లింపులకు క్యూఆర్ కోడ్ ను తప్పకుండా ఉపయోగించాలి. ఆర్థిక లావాదేవీలకు సంబంధించి మీకు వచ్చిన ఎస్ఎంఎస్ లేదా లింక్ ను జాగ్రత్తగా పరిశీలించాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *