షేర్ దారులు, రైతులు, ఫ్యాక్టరీ అభివృద్ధి కోరే వారందరు పాల్గొనాలని పిలుపు
కోవూరు సీపీఎం ఆఫీస్లో మీడియా సమావేశంలో రైతు సంఘం నాయకులు
24న షుగర్ ఫ్యాక్టరీలో సదస్సు
- షేర్ దారులు, రైతులు, ఫ్యాక్టరీ అభివృద్ధి కోరే వారందరు పాల్గొనాలని పిలుపు
- కోవూరు సీపీఎం ఆఫీస్లో మీడియా సమావేశంలో రైతు సంఘం నాయకులు
నెల్లూరు జిల్లా కోవూరు పట్టణంలోని శ్రీ సీతాపోలయ్య సిపిఎం పార్టీ కార్యాలయంలో రైతు సంఘం నాయకులు ఆధ్వర్యంలో షుగర్ ఫ్యాక్టరీ విషయంపై విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రైతు సంఘం నాయకులు మాట్లాడుతూ కోవూరు, కావలి, నెల్లూరు 3 నియోజక వర్గాల పరిధిలో 15 మండలాల లోని రైతుల ఆర్ధికాభి వృద్ధికి షుగర్ ఫ్యాక్టరీ ఎంతగానో తోడ్పాటు ఇచ్చిందని తెలిపారు. గత 20 సంవత్సరాలు నుండి, ప్రతి ఎన్నికల సమయంలో అప్పటి అధికార, ప్రతిపక్షం నాయకులు తాము అధికారంలోకి వస్తే సహకార రంగంలోనే ఫ్యాక్టరిని ఓపెన్ చేస్తామని వాగ్దానాలు చేస్తున్నారే తప్ప చేసిన పాపాన పోలేదన్నారు. ముందుగా షుగర్ ఫ్యాక్టరీ బకాయిలు చెల్లించి షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరించేందుకు తోడ్పాటు అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. దీనిపై భవిష్యత్ కార్యాచరణ కోసం 24 తేదీ షుగర్ ఫ్యాక్టరీ ఆవరణలో జరిగే సదస్సులో షేర్ దారులు, రైతులు, ఫ్యాక్టరీ అభివృద్ధి కోరే వారందరు పాల్గొనాలని కోరారు. 24 తేది జరిగే దానిలో అల్ ఇండియా చెరుకు రైతుల సంఘం నేతలు పాల్గొంటారని తెలిపారు. ఈ సమావేశంలో చెరుకు రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు బిళ్ళా రఘురామయ్య, రైతుసంఘo జిల్లా అధ్యక్ష కార్యదర్శులు పి. శ్రీరాములు, రైతుసంఘం నాయకులు సుబ్బారావు, జీ.శేషయ్య, బాబు, జానికిరాం, విజయ్, పెద్దన్నా , అప్రోజ్, హరి, సురేష్, తదితరులు పాల్గొన్నారు.