జిల్లా కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక
ప్రజల వద్ద నుంచి అర్జీలు స్వీకరించిన కలెక్టర్ ఆనంద్
క్షేత్రస్థాయిలోనే సమస్యలను పరిష్కరించాలని సూచన
ప్రతి సమస్యకు పరిష్కారం చూపాలి
- జిల్లా కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక
- ప్రజల వద్ద నుంచి అర్జీలు స్వీకరించిన కలెక్టర్ ఆనంద్
- క్షేత్రస్థాయిలోనే సమస్యలను పరిష్కరించాలని సూచన
ప్రతి అర్జీ సమస్యకు పరిష్కారం చూపాల్సిన బాధ్యత సంబంధిత అధికారులపై ఉందని జిల్లా కలెక్టర్ ఆనంద్ సూచించారు. నెల్లూరు నగరంలోని జిల్లా కలెక్టరేట్ తిక్కన భవన్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆయన ప్రజల వద్ద నుంచి విజ్ఞప్తులను స్వీకరించారు. ప్రతి అర్జీదారుని సమస్యను విని అందుకు తగిన పరిష్కార మార్గం చూపారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు స్థానికంగా ఎదుర్కొంటున్న పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకుని వెళ్లారు. వాటిని వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులకు కలెక్టర్ ఆదేశించారు. అలాగే జిల్లాలోని ఆయా రెవెన్యూకార్యాలయాల్లో అర్జీదారుల సమస్యలు పరిష్కారమయ్యేలా చూడాలని, జిల్లా ఆఫీస్కు వచ్చేవరకు పెండింగ్ పెట్టకుండా చూడాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కార్తీక్ తో పాటు పలువురు జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారు.