సమాజాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది
పోలీసులకు వినతిపత్రం అందజేసిన జనసేన నాయకులు
పోలీసులకే కాదు….
- సమాజాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది
- పోలీసులకు వినతిపత్రం అందజేసిన జనసేన నాయకులు
మాదకద్రవ్యాల మత్తులో మారణాయుధాల తో తిరుగుతున్న సంఘ విద్రోహ శక్తుల పై చర్యలు తీసుకోవాలని జనసేన సర్వేపల్లి నియోజకవర్గ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు పేర్కొన్నారు. నెల్లూరు జిల్లా… ముత్తుకూరు మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ లో ఎస్సై విశ్వనాథ రెడ్డికి జనసేన నాయకులు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సురేష్ నాయుడు మాట్లాడుతూ….కొందరు యువకులు గంజాయి మత్తుకు భానిసలై సమాజంలో అలజడి సృష్టిస్తున్నారని అటువంటి వారిని ప్రజలే పట్టుకుని పోలీసులకు అప్పజెప్పాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మహిళా నాయకురాలు వాణి భవానీ, మండల అధ్యక్షుడు గణపతి, రహీం, అశోక్, శ్రీహరి చిన్నా తదితరులు పాల్గొన్నారు.