మాకు న్యాయం జరగకపోతే చావే దిక్కు..!
మాకు న్యాయం జరగకపోతే చావే దిక్కు..!!
నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండలం గ్రామ వైఎస్ఆర్సిపి మాజీ సర్పంచ్ లేబురు మల్లికార్జున, వరదా శ్రీధర్ మావద్ద 50 లక్షలు నగదు అప్పుగా తీసుకొని తిరిగి చెల్లించకుండా.. గత కొన్నేళ్లుగా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారని ఇందుకూరుపేటకు చెందిన గండవరం సంధ్య, అనిల్ కుమార్ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. తన వ్యాపారం కోసం నెల్లూరు మూలపేటలోని అంతస్తుల భవనానికి చెందిన ఇంటి పత్రాలను ప్రైవేటు బ్యాంకులో తనకా పెట్టి ఆ మొత్తాన్ని లేబురు మల్లికార్జున, వరదా శ్రీధర్ అనే వ్యక్తులకు వ్యాపార నిమిత్తం అప్పుగా ఇచ్చామని.. 10 సంవత్సరాలైనా అతను అప్పు తీర్చకపోవడంతో తమ గృహం బ్యాంకు వారు వేలం వేస్తున్నారని.. బాధితులు చింతోపులోని లేబురు శ్రీనివాసులు నివాసముందు టెంట్ వేసి శాంతియుత నిరసన తెలియజేశారు.
తమకు చెల్లించాల్సిన రుణాన్ని చెల్లించి తమ ఇంటిని బ్యాంకు వారి వేలం నుండి విడిపించాలని.. లేదంటే మా కుటుంబానికి చావడం తప్ప మరొక మార్గం లేదని వారు ఆవేదన చెందారు. గత రెండు రోజులుగా లేబురు శ్రీనివాసులు ఇంటిముందు నిరసన తెలియజేస్తూ విషయాన్ని పోలీసులు దృష్టికి తీసుకువెళ్లిన ప్రయోజనం లేదని..సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి తమ గోడు వినిపించుకున్నారు. పోలీస్ అధికారులు సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తమకు న్యాయం చేసి లేబర్ మల్లికార్జున వరదా శ్రీధర్ నుండి రావాల్సిన మొత్తాన్ని మాకు ఇప్పించి గృహాన్ని కాపాడమని మీడియా ముఖంగా కోరారు.