ప్రైవేటు టీచ‌ర్ల‌కు ఇళ్ల స్థ‌లాల‌కు కృషి

స‌ర్వేప‌ల్లి రాధాకృష్ణ‌న్ విగ్రహ నిర్మాణానికి చ‌ర్య‌లు

మంత్రి నారాయ‌ణ దృష్టికి తీసుకెళ్లి.. స‌మ‌స్య‌ల ప‌రిష్కారం

ఏపీ ప్రైవేటు స్కూల్స్ అసోసియేష‌న్ కార్య‌వ‌వ‌ర్గ ప్ర‌మాణ స్వీకారంలో వేమిరెడ్డి విజ‌య‌భాస్క‌ర్‌రెడ్డి హామీ

ప్రైవేటు టీచ‌ర్ల‌కు ఇళ్ల స్థ‌లాల‌కు కృషి

-స‌ర్వేప‌ల్లి రాధాకృష్ణ‌న్ విగ్రహ నిర్మాణానికి చ‌ర్య‌లు
-మంత్రి నారాయ‌ణ దృష్టికి తీసుకెళ్లి.. స‌మ‌స్య‌ల ప‌రిష్కారం
-ఏపీ ప్రైవేటు స్కూల్స్ అసోసియేష‌న్ కార్య‌వ‌వ‌ర్గ ప్ర‌మాణ స్వీకారంలో

వేమిరెడ్డి విజ‌య‌భాస్క‌ర్‌రెడ్డి హామీ

ఏపీ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్- అప్స నెల్లూరు జిల్లా, నియోజకవర్గాల కమిటీలు ఏర్పాట‌య్యాయి. వారి ప్ర‌మాణ స్వీకారం కార్య‌క్ర‌మం నెల్లూరు న‌గ‌రంలోని జెట్టి శేషారెడ్డి భ‌వ‌న్‌లో ఆదివారం జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి నారాయ‌ణ విద్యా సంస్థ‌ల జీఎం వేమిరెడ్డి విజ‌య‌భాస్క‌ర్‌రెడ్డి, అప్స రాష్ట్ర అధ్య‌క్షులు సుబ్ర‌హ్మ‌ణ్యంరాజు, మాజీ అధ్య‌క్షులు సుంద‌రం, నెల్లూరు గౌర‌వాధ్య‌క్షులు చాట్ల న‌ర‌సింహారావు, క‌ర్తం ప్ర‌తాప్‌రెడ్డిలు హాజ‌రయ్యారు. ఈ సంద‌ర్భంగా 40 ఏళ్ల అప్స బ్రోచ‌ర్‌ను వీబీఆర్ చేతుల‌మీదుగా ప్రారంభించారు. అలాగే.. ప్రైవేటు స్కూల్స్‌కు సంబంధించిన జ‌.ఈవో బుక్‌ను జిల్లా క‌మిటీ, న‌గ‌ర క‌మిటీకి అంద‌జేశారు. అనంత‌రం విజ‌య‌భాస్క‌ర్‌రెడ్డి మాట్లాడారు. నెల్లూరులో సర్వేపల్లి రాధాకృష్ణన్ విగ్రహ నిర్మాణానికి ఏర్పాటు, ప్రైవేట్ స్కూల్లో పని చేసే టీచర్లకు ఇళ్ల స్థ‌లాలు, నిర్మాణాలు, ఇత‌ర స‌మ‌స్య‌ల‌ను మంత్రి పొంగూరు నారాయణ దృష్టికి తీసుకెళ్లి.. ప‌రిష్కారం అయ్యేలా కృషి చేస్తాన‌ని ఈసంద‌ర్భంగా ఆయ‌న హామీ ఇచ్చారు. అనంత‌రం రాష్ట్ర అధ్యక్షులు సుబ్రమణ్య రాజు, మాజీ అధ్యక్షులు సుందరం మాట్లాడుతూ.. ప్రైవేట్ స్కూల్స్ జీవోల గురించి అవగాహన, ప్రైవేట్ స్కూల్స్ లోని ఉన్న‌ సమస్యలను విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకుని వెళ్లి పరిష్కరిస్తామన్నారు. త‌ర్వాత ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు జ‌న్మ‌దినం సంద‌ర్భంగా అప్స ఆధ్వ‌ర్యంలో భారీ కేకు కోసి.. ఫ్ల‌కార్డులు ప్ర‌ద‌ర్శించి.. శుభాకాంక్షులు తెలియ‌జేశారు. అనంత‌రం రాష్ట్ర అధ్యక్షులు.. నెల్లూరు జిల్లా, నగర, కావ‌లి, కోవూరు, ఉద‌య‌గిరి కార్య‌వ‌ర్గాన్ని ప్ర‌క‌టించి.. వారిచే ప్ర‌మాణ స్వీకారం చేయించి.. ఆయ‌న చేతుల‌మీదుగా వారికి స‌న్మానం, ప్ర‌శంస ప‌త్రం అంద‌జేశారు. త‌ర్వాత క‌ర్తం ప్ర‌తాప్‌రెడ్డి, చాట్ల న‌ర‌సింహారావులు మాట్లాడారు. క‌ర‌స్పాండెంట్లు త‌మ‌పై పెట్టుకున్న న‌మ్మ‌కాన్ని నిల‌బెట్టుకుంటామ‌న్నారు. ఈ కార్య‌క్ర‌మంలో ప్రైవేటు స్కూళ్ల క‌ర‌స్పాండెంట్లు, ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *