నెల్లూరులో ఘోర రోడ్డు ప్రమాదం
నెల్లూరులో ఘోర రోడ్డు ప్రమాదం
- ఇద్దరు మృతి
నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం కదిరినాయుడు పల్లి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. కడప జిల్లా అట్లూరు మండలం ముత్తుకూరుకు చెందిన మళ్లీ నరసింహులు, బద్వేల్ మున్సిపాలిటీలోని గోపారం పేటకు చెందిన ఝాన్సీ నెల్లూరు జిల్లాలోని పెంచలకోన కు వెళ్లి తిరిగి వారి స్వగ్రామాలకు వెళ్తుండాగా వారు ప్రయాణిస్తున్న బైక్ అదుపుతప్పి చెట్టును ఢీ కొట్టింది. యువతి అక్కడికక్కడే మృతిచెందగా యువకుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.