వక్ఫ్ సవరణచట్ట రద్దు రాజ్యాంగ విరుద్ధం

కావలి పట్టణంలో వామపక్ష పార్టీలు ఆందోళన

బ్రిడ్జి సెంటరులో అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన

వక్ఫ్ సవరణచట్ట రద్దు రాజ్యాంగ విరుద్ధం…

  • కావలి పట్టణంలో వామపక్ష పార్టీలు ఆందోళన
  • బ్రిడ్జి సెంటరులో అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన

వక్ఫ్ సవరణ చట్టం రాజ్యాంగ విరుద్ధమని వామపక్ష పార్టీల నేతలు తెలిపారు. కావలి పట్టణంలో బ్రిడ్జి సెంటరులో అంబేద్కర్ విగ్రహం వద్ద వామపక్ష పార్టీల నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. మైనార్టీల ఆస్తులు కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టే ప్రయత్నంలో భాగంగా బీజేపీ ప్రభుత్వం కుట్ర పూరిత నిర్ణయాలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా సిపిఎం నాయకులు పసుపులేటి పెంచలయ్య, సిపిఐ నాయకులు బలిజేపల్లి వెంకటేశ్వర్లు, విద్యార్థి సంఘం మాజీ నాయకులు కరవధి భాస్కర్, సిపిఐ ఎంఎల్ నాయకులు యల్ లక్ష్మారెడ్డి, ఆర్.ఎస్.పి జిల్లా కార్యదర్శి గోసాల రవికాంత్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలోనాగరాజు, దర్గా బాబు, బోసు, ఎల్. శ్యామల, కృష్ణా మోహన్, బి. కృష్ణయ్య, నర్సింహులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *