టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాలేపాటి సుబ్బానాయుడు ఆధ్వర్యంలో సంబరాలు
కేక్ కట్ చేసి ముఖ్యమంత్రికి శుభాకాంక్షలు తెలిపిన నేతలు
మహిళలకు చీరలు పంపిణీ
ఘనంగా ముఖ్యమంత్రి జన్మదిన వేడుకలు
- దగదర్తిలో టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాలేపాటి సుబ్బానాయుడు ఆధ్వర్యంలో వేడుకలు
- కేక్ కట్ చేసి ముఖ్యమంత్రికి శుభాకాంక్షలు తెలిపిన నేతలు
- మహిళలకు చీరలు పంపిణీ
నెల్లూరు జిల్లా దగదర్తిలో టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాలేపాటి సుబ్బానాయుడు ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 75 జన్మదిన వేడుకలను ఆదివారం ఘనంగా జరుపుకున్నారు. మాలేపాటి సోదరులు సుబ్బానాయుడు, రవీంద్ర నాయుడులు టిడిపి శ్రేణుల కేరింతల మధ్య భారీ కేక్ కట్ చేసి ముఖ్యమంత్రికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా 15 వందల మహిళలకు మాలేపాటి సోదరులు చేతుల మీదుగా చీరలు పంపిణీ చేశారు. మాలేపాటి సుబ్బానాయుడు, మండల యువనేత భాను ప్రకాష్ లు మాట్లాడుతూ… దగదర్తిలో అంబేద్కర్, ఎన్టీఆర్ విగ్రహాలను నెలకొల్పామని, వీటి ఆవిష్కరణకు సినీ హీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, మంత్రి నారా లోకేష్ చేతులమీదుగా ఆవిష్కరించాలని ఆలోచన చేస్తున్నట్లు వారు తెలిపారు.