ఐఐటీ జేఈఈ మెయిన్స్ నారాయణ విజయకేతనం

ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులు

విద్యార్థుల్ని అభినందించిన విద్యా సంస్థల

జీఎం వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి, ఉపాధ్యాయులు

ఐఐటీ జేఈఈ మెయిన్స్ నారాయణ విజయకేతనం…

  • ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులు
  • విద్యార్థుల్ని అభినందించిన విద్యా సంస్థల జీఎం వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి, ఉపాధ్యాయులు

శనివారం విడుదలైన ఐఐటీ జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో… నెల్లూరు నారాయణ విద్యా సంస్థల విద్యార్థులు విజయకేతనం ఎగుర వేశారు. ఈ సందర్భంగా నగరంలోని నారాయణ కాలేజీలో అభినందన సభ ఏర్పాటు చేశారు. జాతీయ స్థాయిలో జనరల్ కేటగిరిలో 1వ ర్యాంకు తోపాటు…25 లోపు 10 ర్యాంకులను సాధించిన విద్యార్థినీ విద్యార్థుల్ని నారాయణ విద్యా సంస్థల జనరల్ మేనేజర్ వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. ఇంతటి ఘన విజయానికి కారుకులైన విద్యార్థులు, తల్లిదండ్రులు, అధ్యాపకుల్ని కళాశాల యాజమాన్యం ప్రత్యేకంగా ప్రశంసించింది. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. విద్యా సంస్థల పటిష్టమైన మైక్రో షెడ్యూల్, బోధనా పద్దతులు, పరీక్షా విధానాల వల్లే మంచి ఫలితాలు సాధించగలిగామన్నారు. కార్యక్రమంలో కోర్ డీన్, డీన్ లు, ఏజీఎంలు, ప్రిన్సిపాళ్లు, అధ్యాపక సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *