మోసపోయాం మహాప్రభో… న్యాయం చేయండి

న్యాయం చేయకుంటే ఆత్మహత్యే శరణ్యం

చింతోపులో లేబూరు మల్లికార్జున ఇంటి ఎదుట ఆందోళన దిగిన బాధితులు

మోసపోయాం మహాప్రభో…న్యాయం చేయండి

  • న్యాయం చేయకుంటే ఆత్మహత్యే శరణ్యం
  • చింతోపులో లేబూరు మల్లికార్జున ఇంటి ఎదుట ఆందోళన దిగిన బాధితులు

నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండలం చింతోపు గ్రామానికి చెందిన లేబూరు మల్లికార్జున్ అనే వ్యక్తి వల్ల మోసపోయామని
ఇందుకూరుపేట కొత్తూరు గ్రామానికి చెందిన బాధిత కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు. ఈ మేరకు చింతోపు గ్రామంలోని మల్లికార్జున నివాసం ఎదుట బాధితులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. బాధితులు తెలిపిన వివరాల మేరకు… దూరపు బంధువైన లేబూరు మల్లికార్జున అనే వ్యక్తి వ్యాపార నిమిత్తం కొంత నగదు అవసరమని చెప్పారన్నారు. ఆయన మోసపూరిత మాటలతో మా కుటుంబ సభ్యులను నమ్మించి తమ సొంత ఇంటి పత్రాలను ప్రైవేట్ బ్యాంకుల నందు తాకట్టు పెట్టి నగదు తీసుకున్నాడన్నారు. అయితే గత కొన్ని సంవత్సరాలుగా డబ్బులు ఇవ్వమని అడుగుతుంటే…ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నాడని ఆరోపించారు. ఈ విషయంపై అధికారుల చుట్టూ తిరిగినా…తమకు న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇతని వల్ల సొంత ఇంటినే కోల్పయే స్థితికి వచ్చేశామన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని…లేకుంటే ఆత్మహత్య శరణ్యమని కన్నీటి పర్వంతమయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *