బ్రెయిన్స్ట్రోక్తో చికిత్స పొందుతున్న టీడీపీ కార్యకర్త సురేష్
అతని కుటుంబ పరిస్థితిని మంత్రి లోకేష్కు తెలిపిన సంగం టీడీపీ నేతలు
బాధితుడి వైద్యసాయంతో పాటు ఆ కుటుంబానికి అండగా ఉంటామని మంత్రి భరోసా
కార్యకర్తకు అండగా మంత్రి లోకేష్
- బ్రెయిన్స్ట్రోక్తో చికిత్స పొందుతున్న టీడీపీ కార్యకర్త సురేష్
- అతని కుటుంబ పరిస్థితిని మంత్రి లోకేష్కు తెలిపిన సంగం టీడీపీ నేతలు
- బాధితుడి వైద్యసాయంతో పాటు ఆ కుటుంబానికి అండగా ఉంటామని మంత్రి భరోసా
నెల్లూరు జిల్లా సంగం మండలం జెండాదిబ్బ గ్రామానికి చెందిన సురేష్ బుచ్చిరెడ్డిపాలెంలో సెలూన్ నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఇటీవల అతను బ్రెయిన్ స్ట్రోక్కు గురవడంతో నెల్లూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే ఎనిమిది లక్షల రూపాయల వరకు వైద్యం కోసం ఖర్చయింది. ఉన్న డబ్బులతో పాటు అప్పోసప్పో చేసి చికిత్స అందించారు. ప్రస్తుతం కష్టతరంగా ఉన్న నేపథ్యంలో ఆ కుటుంబం ఇబ్బందులు పడుతుండడంతో ఐటీడీపీ వారు మంత్రి లోకేశ్ దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో స్పందించిన మంత్రి నారా లోకేష్ వెంటనే సురేష్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారని, వైద్యసాయానికి తగు చర్యలు చేపడతామని, ప్రతి కార్యకర్తకు అండగా ఉంటామని ఆయన ఎక్స్ వేదికగా తెలియజేసినట్లు టీడీపీ నేతలు చెప్పారు.