P4 విధానం ద్వారా పంచాయితీ అభివృద్ధి
లాంఛనంగా ప్రకటించిన సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి
పాల్గొన్న జిల్లా, PCB చైర్మన్, కలెక్టర్, పోర్ట్ సీఈవో
అదాని దత్తపుత్రికగా ముత్తుకూరు
- P4 విధానం ద్వారా పంచాయితీ అభివృద్ధి
- లాంఛనంగా ప్రకటించిన సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి
- పాల్గొన్న జిల్లా, PCB చైర్మన్, కలెక్టర్, పోర్ట్ సీఈవో
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీసుకువచ్చిన పి ఫోర్ విధానం ద్వారా మోడల్ పంచాయితీ గా ముత్తుకూరు ను అభివృద్ధి చేసేందుకు అదాని ఫౌండేషన్ ముందుకు రావడం శుభపరిణామం అని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పేర్కొన్నారు. పి ఫోర్ విధానం ద్వారా అదాని ఫౌండేషన్ ముత్తుకూరుని దత్తత తీసుకున్న సందర్భంగా నెల్లూరు జిల్లా… ముత్తుకూరు మండల కేంద్రంలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఏపీ కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్ కృష్ణయ్య, జిల్లా కలెక్టర్ ఆనంద్, పోర్ట్ సీఈవో జగదీష్ పటేల్ తదితరులతో కలిసి సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి ముఖ్య అతిదిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ చైర్మన్ కృష్ణయ్య మాట్లాడుతూ…. వ్యక్తిగత పరిశుభ్రత పై గ్రామస్థాయిలో ప్రతిఒక్కరూ దృష్టి పెట్టాలని చెప్పారు. అనంతరం జిల్లా కలెక్టరేట్ ఆనంద్ మాట్లాడుతూ…ముత్తుకూరు పంచాయితీ అభివృద్ధి కి ప్రభుత్వం నుంచి అన్నిరకాలుగా చర్యలు తీసుకుంటున్నామని, ప్రభుత్వంతో పాటుగా పోర్ట్ యాజమాన్యం ముందుకు రావడంతో అభివృద్ధి కార్యక్రమాలు మరింత విస్తృతంగా చేసేందుకు వీలుంటుందని చెప్పారు. ముత్తుకూరు అభివృద్ధి కి అన్నీ విధాలుగా సంసిద్ధంగా అదాని యాజమాన్యం ఉందని పోర్ట్ సీఈవో జగదీష్ పటేల్ చెప్పారు. స్యానిటేషన్, ఎడ్యుకేషన్, రెన్యుబల్ ఎనర్జీ, ఎంపవర్ మెంట్ తో పాటుగా క్రీడలు, స్మశానాల అభివృద్ధి పై అదాని ఫౌండేషన్ కృషిచేయాలని ఎమ్మెల్యే సోమిరెడ్డి కోరారు. చివరగా ఎంపీడీఓ కార్యాలయం ఆవరణలో మొక్కలు నాటిన అనంతరం…. చెత్త తరలింపు వాహనాన్ని జెండాఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ ద్వామా పీడీ గంగాభవాని, ఆర్డీవో నాగ సంతోష్ అనూష, టీడీపీ మండల అధ్యక్షుడు పల్లంరెడ్డి రామ్మోహన్ రెడ్డి, కార్యదర్శి నీలం మల్లికార్జున యాదవ్, నాయకులు ఈదూరు రామ్మోహన్ రెడ్డి, అకయ్యగారి ఏడుకొండలు, షఫీవుల్లా నాయకులు కార్యకర్తలు అధికారులు పాల్గొన్నారు.