భూమన హయాంలో టీటీడీ దోపిడీకి గురైంది
నాస్తికుడైన కరుణాకర్రెడ్డి గోమాత గురించి మాట్లాడ్డం సిగ్గుచేటు
భూమనపై మండిపడ్డ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి
టీటీడీ విషయంలో వైసీపీ పెద్ద కుట్రే చేస్తోంది..!
భూమన హయాంలో టీటీడీ దోపిడీకి గురైంది-
నాస్తికుడైన కరుణాకర్రెడ్డి గోమాత గురించి మాట్లాడ్డం సిగ్గుచేటు
భూమనపై మండిపడ్డ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి
టీటీడీ దేవస్థానాన్ని అపవిత్రం చేయాలన్నదే వైసీపీ కుట్ర చేస్తుందని.. పాలక వర్గాన్ని.. అధికారులను అవమానపరచాలని చూస్తున్నారంటూ.. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అన్నారు. టీటీడీలో జరిగే మంచి పనులను అభినందించాల్సిందిపోయి.. అడ్డుకుంటుందంటూ ఆయన మండిపడ్డారు.
అనుక్షణం ఏదో ఒక నెపంతో బురద జల్లుతూ.. అక్కడి వాతావరణాన్ని కలుషితం చేసే ప్రయత్నం చేస్తున్నారని.. బ్రహ్మోత్సవాలు, ముక్కోటి, నేడు కోదండరామస్వామి కళ్యాణం సమయంలో నిత్యం ఏదో ఒక అడ్డు తగులుతూనే ఉందంటూ వైసీపీపై ధ్వజమెత్తారు. పార్టీలకు అతీతంగా.. సీపీఐ నారాయణ సైతం టిటిడి పాలకవర్గం బ్రహ్మాండంగా పని చేస్తుందని కితబిచ్చారని గుర్తు చేశారు. ఎక్కడైనా కొన్ని సహజ మరణాలు ర్వసాధారణమేనని.. రెండు సార్లు టీటీడీ ఛైర్మన్గా , ఎమ్మెల్యేగా పనిచేసిన భూమన కరుణాకర్రెడ్డి లాంటి నాస్తికుడు హయాంలో టీటీడీ మొత్తం దోపిడీకి గురైందని ఈసందర్భంగా మంత్రి ఆనం పేర్కొన్నారు. నెల్లూరు జిల్లా పరిషత్ కార్యాలయం వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. హిందూదర్మం ప్రకారం.. గోవు దేవత అలాంటి గోమాత సర్వ సదారణ మరణాన్ని ముఖ్యమంత్రికో, దేవాదాయ శాఖ మంత్రికో, టిటిడి చైర్మన్ కో అంటగట్టడం బుద్ది లేని పనులంటూ కరుణాకర్రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆగమన, సనాతన, విజ్ఞానం, విజ్ఞత, హిందూధర్మం, వైదిక పండిత్యం లేని నాస్తికుడు కరుణాకర్ మాత్రమే ఇలా మాట్లాడగలుగుతాడంటూ భూమనపై ఓ రేంజ్లో ఫైర్ అయ్యారు. నాస్తికుడైన కరుణాకర్రెడ్డి.. హిందూ మంతం, గోమాత గురించి మాట్లాడ్డం సిగ్గుపడాలన్నారు. గోవు, తల్లి గురించి మాట్లాడే మీ నాయకుడి తల్లే.. నా కడుపున ఎలా పుట్టావు అని అడుగుతుందన్నారు. గో శాలలో ఎలాంటి తప్పిదం జరగడంలేదని.. గోశాలలో అన్ని ఆవులకు పవిత్ర విధానంలో టీటీడీ పాలకవర్గం పనిచేస్తుందంటూ.. ఈ సందర్భంగా ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు.