23 మందికి రూ. 31.08 లక్షలు పంపిణీ

నిరుపేదల ఆరోగ్య పరిరక్షణే కూటమి ప్రభుత్వ తొలి ప్రాధాన్యత

లబ్ధిదారులకి సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

23 మందికి రూ. 31.08 లక్షలు పంపిణీ

  • నిరుపేదల ఆరోగ్య పరిరక్షణే కూటమి ప్రభుత్వ తొలి ప్రాధాన్యత
  • లబ్ధిదారులకి సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

అత్యవసర వైద్య అవసరాలకు పేదరికం అడ్డు రాకూడదన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆశయమని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి తెలిపారు. నెల్లూరు నగరం మాగుంట లేఅవుట్ లోని విపిఆర్ నివాసంలో ఆమె కోవూరు నియోజకవర్గ పరిధిలోని 23 మంది అనారోగ్య పీడితులకు 31 లక్షల 8 వేల 483 రూపాయల విలువ చేసే ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు అందచేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ప్రజల ఆరోగ్య పరిరక్షణే కూటమి ప్రభుత్వ తొలి ప్రాధాన్యత అన్నారు. ముఖ్యమంత్రి సహాయనిధి అత్యవసర సహాయం అందిస్తూ చంద్రబాబు నాయుడు నిరు పేదలకు ప్రాణభిక్ష పెడుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు బెజవాడ వంశీకృష్ణారెడ్డి, పెన్నాడెల్టా ఛైర్మెన్ జెట్టి రాజగోపాలరెడ్డి, రావెల వీరేంద్ర నాయిడు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *