వ‌స‌తుల్లేక‌నే.. వ‌సూళ్లా..?

సూళ్లూరుపేట చేప‌ల మార్కెట్‌లో దందా

క‌నీస వ‌స‌తులు కూడా ఏర్పాటుచేయ‌ని మున్సిపాలిటీ

అవ‌స్థ‌లు ప‌డుతున్న చేప‌ల విక్ర‌య‌దారులు

స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించాలంటూ క‌మిష‌న‌ర్‌కు విన‌తి

చేప‌ల‌మార్కెట్ స‌మ‌స్య‌ల‌పై ఎన్‌-3వ‌ద్ద ఆవేద‌న

వ‌స‌తుల్లేక‌నే.. వ‌సూళ్లా..?

సూళ్లూరుపేట చేప‌ల మార్కెట్‌లో దందా
క‌నీస వ‌స‌తులు కూడా ఏర్పాటుచేయ‌ని మున్సిపాలిటీ
అవ‌స్థ‌లు ప‌డుతున్న చేప‌ల విక్ర‌య‌దారులు
స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించాలంటూ క‌మిష‌న‌ర్‌కు విన‌తి

చేప‌ల‌మార్కెట్ స‌మ‌స్య‌ల‌పై ఎన్‌-3వ‌ద్ద ఆవేద‌న

తిరుప‌తిజిల్లా.. సూళ్లూరుపేట‌లోని చేప‌ల‌మార్కెట్‌లో అన్నీ స‌మ‌స్య‌లే.. ఉంటుందా..? కూలుతుందో తెలియ‌ని భ‌వ‌న స‌ముదాయం.. వ‌స‌తులుండ‌వ్‌.. క‌నీసం.. చేప‌ల‌ను నివ్వ ఉంచుకునేందుకు ఫ్రీజ‌ర్లు లేవు.. చెత్త, చెదారాలు, చేప‌ల‌ను శుభ్ర‌ప‌ర్చుకునేందుఉ నీటి వ‌స‌తి లేదు.. అనేక అవ‌స‌ర‌మైన వ‌స‌తులు క‌ల్పించ‌కుండానే.. అధికారులు వ్యాపారుల వ‌ద్ద ముక్కుపిండి వ‌సూళ్లు చేస్తున్నారు. కొంద‌రైతే.. అద‌న‌పు న‌గ‌దు వ‌సూళ్లు చేస్తూ.. త‌మ జేబు నింపుకుంటున్నార‌న్న విమ‌ర్శ‌లూ ఉన్నాయి. అంతేకాకుండా.. రాత్రుల స‌మ‌యంలో కొంద‌రు వ్య‌క్తులు చోరీల‌కు పాల్ప‌డుతున్నార‌ని.. వారు పేర్కొన్నారు. ఈ నేప‌థ్యంలో అక్క‌డి చేప‌ల వ్యాపారులు త‌మ స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్‌ను క‌ల‌సి విన‌తిప‌త్రం స‌మ‌ర్పించారు. గ‌తంలో ఓ బాక్స్ చేప‌ల విక్ర‌యానికి రూ.50లు మాత్ర‌మే తీసుకునేవాళ్ల‌ని.. ఇప్పుడు మూడింత‌లు పెంచి.. 120 రూపాయిలు చెల్లించాలంటూ.. డిమాండ్ చేస్తున్నారని వ్యాపారులు వాపోతున్నారు. ముఖ్యంగా.. చేపల మార్కెట్ లో నీరు, బాత్రూం, కనీస భద్రత సౌకర్యాలు కూటమి ప్రభుత్వం కల్పించాలని కోరారు. సిపిఐ నాయకులు చెంగేని సుధాకర్ రెడ్డి, ఇలప నాగేంద్ర ఆధ్వర్యంలో స్థానిక మున్సిపల్ కమిషనర్ కె.చిన్నయ్య కు మొరపెట్టుకున్నారు. సానుకూలంగా స్పందించిన కమిషనర్ దీనిపై సమావేశం ఏర్పాటు చేసి సమస్యకు పరిష్కారం మార్గం చూపేలా చర్యలు తీసుకుంటామని వారికి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో చేపల విక్రయదారులు శీనయ్య, గాయత్రి, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *