సమస్యల పరిష్కారానికి వివేకం
ప్రజలతో మమేకం..
సమస్యల పరిష్కారానికి వివేకం..!!
కావలి 8వ వార్డులో ఇంటింటికి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి కార్యక్రమం
వార్డులో సమస్యల గుర్తింపు.. పరిష్కారానికి హామీ
కావలి పట్టణం 8వ వార్డులో ఇంటింటికి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి కార్యక్రమం మంగళవారం జరిగింది. వార్డు
ప్రజలతో ఎంతో మమేకం అవుతూ వారిని ఆప్యాయంగా పలకరిస్తూ వారి సాధక బాధలు తెలుసుకున్నారు. అదేవిధంగా చిరు వ్యాపారస్తుల వద్దకు వెళ్ళి పలకరించి వారి ఉపాధి పై ఆరా తీశారు. వార్డులో పలు టిఫిన్ దుకాణాల వద్ద దోశలు పోసి వారిని ఉత్సాహ పరిచారు. వార్డులో వివేకానంద పార్కు సందర్శించి
అక్కడి సమస్యలు తెలుసుకున్నారు. వ్యాయామం చేసే పరికరాలపై ఊగి అందరూ నిత్యం వ్యాయామం చేసి ఆరోగ్యంగా ఉండాలని సూచించారు. వార్డులో ప్రధాన డ్రైనేజీ వరవ కాలువ సమస్య తెలుసుకున్నారు. రేషన్ కార్డులు, పక్కా గృహాలు, ఇంటి స్థలాలు లేని వారి నుంచి అర్జీలు స్వీకరించారు. ఎమ్మెల్యే వెంట మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్, పట్టణ అధ్యక్షుడు గుత్తికొండ కిషోర్, ప్రధాన కార్యదర్శి జ్యోతి బాబురావు, వార్డు ఇంచార్జ్ రహీం, వార్డు అధ్యక్షులు మోహన్, పట్టణ మహిళ అధ్యక్షురాలు ఆర్షియా బేగం, నాయకులు శానం హరి , నాయబ్ రసూల్, ఏగూరి చంద్రశేఖర్, రాష్ట్ర లీగల్ సెల్ ఉపాధ్యక్షులు పొట్లూరి శ్రీనివాసులు తదితరులు ఉన్నారు.