వేలంపాట నిర్వహించిన ఆలయ ఈవో పోరెడ్డి శ్రీనివాసులురెడ్డి
పెంచలకోనలో 53 షాపులకు వేలంపాట
- వేటంపాట నిర్వహించిన ఆలయ ఈవో పోరెడ్డి శ్రీనివాసులురెడ్డి
నెల్లూరు జిల్లా రాపూరు మండలం ప్రాముఖ్య పుణ్యక్షేత్రమైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో తాత్కాలిక 53 షాపులకు వేలంపాట నిర్వహించారు. మే నెలలో జరగబోవు శ్రీ లక్ష్మి నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు సందర్భంగా దేవస్థానం EO పోరెడ్డి శ్రీనివాసులు రెడ్డి ఆధ్వర్యంలో వేలంపాట జరిగింది. వ్యాపారస్తులు 3000 రూపాయలు రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించి వేలంపాటలో పాల్గొని షాపులను దక్కించుకున్నారు. ఈ కార్యక్రమంలో పెంచలకోన దేవస్థానం ఆలయ అధికారులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.