కల్తీలేని వార్తలు-కలకలం రేపే కథనాలు
ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా బుధవారం ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. గాలుల ధాటికి రూరల్ మండలం గుడిపల్లిపాడులో రైస్ మిల్ కి చెందిన భారీ గోడ కుప్పకూలిపోయింది. ఆ సమయంలో రహదారిపై ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. పలు చోట్ల భారీ చెట్లు నేలకొరిగాయి. విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
అమరావతిలోని ఏపీ మండలిలో ఎమ్మెల్సీగా బీద రవిచంద్ర యాదవ్ ప్రమాణ స్వీకారం చేశారు. శాసన మండలి చైర్మన్ కోయ్యే మోషేను రాజు ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. బీద వెంట ఆయన సతీమణి, టీడీపీ నేతలు ఉన్నారు.
కేంద్ర ప్రభుత్వం పాలనకు వ్యతిరేకంగా కాంగ్రెస్ నేతలు నెల్లూరులో ధర్నా చేపట్టారు. వీఆర్సీ సెంటర్ వద్ద వారు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలియజేశారు.
నెల్లూరు వీఆర్సీ సెంటర్ వద్ద డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో నిరుద్యోగులు ఆందోళన చేపట్టారు. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వారు నినాదాలు చేశారు. డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
కోవూరులో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి పర్యటించారు. రూ. 25 లక్షలతో నిర్మించిన కైలాస భూమి రోడ్డుని ఆమె ప్రారంభించారు. అనంతరం ప్రజా సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు.
నెల్లూరు మెడికవర్ హాస్పిటల్ వైద్యులు అతి క్లిష్టమైన శస్త్రచికిత్సను విజయవంతం చేసి ఐదేళ్ల బాలిక ప్రాణాలను కాపాడారు. ఈ మేరకు వారు మీడియా సమావేశం నిర్వహించి వివరాలు తెలియజేశారు
కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిపై ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ధన దాహంతో నియోజకవర్గాన్ని భ్రష్టుపట్టించాడని విమర్శించారు.
సూళ్లూరుపేట చేపల మార్కెట్లో కొందరు అధికారులు వ్యాపారస్తుల వద్ద ముక్కుపిండి నగదు వసూళ్లు చేస్తున్నారని విక్రయదారులు ఆరోపించారు. తమ సమస్యల్ని వెంటనే పరిష్కరించాలని వారు కమిషనర్ కు వినతి పత్రం అందచేశారు.
నెల్లూరు నారాయణ వైద్య విద్యా సంస్థల ప్రాంగణంలో రాష్ట్ర స్థాయి క్రీడలు ఘనంగా ప్రారంభమయ్యాయి. పోటీలకు మంత్రి నారాయణ అల్లుడు గంటా రవిజతేజ హాజరయ్యారు. చదువు, క్రీడలు జీవితంలో ఎంతో ముఖ్యమని ఆయన అన్నారు.
కావలిలోని 8 వార్డులో ఇంటింటికి ఎమ్మెల్యే కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి పర్యటించారు. టిఫిన్ దుకాణాల వద్ద ఆయన దోశలు పోసి వారిని ఉత్సాహపరిచారు.
ముత్తుకూరు ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ సుగణ అధ్యక్షతన మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం జరిగింది. సమావేశంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల గురించి వివరించారు.
ఓ వ్యక్తిని నమ్మించి మోసం చేసి బంగారం తీసుకొని వెళ్లిపోయిన ముద్దాయిని సంతపేట పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి వద్ద నుంచి రూ. 5.40 లక్షల విలువ చేసే 108 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు. రూరల్ డీఎస్పీ ఘట్టమనేని శ్రీనిసరావు మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు.