సంక్షిప్త వార్త మాలిక
నెల్లూరులో ఓ దళిత యువతి దారుణ హత్య కలకలం రేపుతోంది. రూరల్ పోలీసుస్టేషన్ ఎదుట కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళనకు దిగారు. నిందితుల్ని ఉరి తీయాలంటూ డిమాండ్ చేశారు.
నెల్లూరులోని వీపీఆర్ నివాసంలో కోవూరు నియోజకవర్గం పరిధిలోని 23 మందికి రూ. 31,08,483 విలువ చేసే సీఎం సహాయ నిధి చెక్కులను ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి పంపిణీ చేశారు. నిరుపేదల ఆరోగ్య పరిరక్షణే కూటమి ప్రభుత్వ తొలి ప్రాధాన్యత ఇస్తుందని ఆమె తెలిపారు.
ప్రజలకి నాయకుడంటే ఎలా ఉండాలో మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి హితవు పలికారు. కావలిలో జరిగిన ఇంటింటికి ఎమ్మెల్యే కార్యక్రమంలో ఆయన ఘాటుగానే స్పందించారు.
రాపూరు మండలం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో తాత్కాలిక 53 షాపులకు వేలంపాట నిర్వహించారు. వ్యాపారస్తులు 3000 రూపాయలు రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించి వేలంపాటలో పాల్గొని షాపులను దక్కించుకున్నారు.
అల్లూరులో బుధవారం ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. మండలంలోని రహదారులన్నీ వర్షపు నీటితో జలమయమయ్యాయి. ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు.
దళితులపై పెట్టిన అక్రమ కేసుల్ని వెంటనే ఎత్తి వేయాలంటూ సైదాపురం రెవెన్యూ కార్యాలయం ఎదుట గ్రామ దళితులు ఆందోళనకు దిగారు. అక్రమ కేసులు ఎత్తేసి…భూములకు యాజమాన్య హక్కులు కల్పించాలని వారు డిమాండ్ చేశారు.
గూడూరులోని రైల్వే స్టేషన్లో అగ్నిమాపక శాఖ వారోత్సవాలు జరిగాయి. అగ్ని ప్రమాదాలపై రైల్వే సిబ్బందికి ఫైర్ ఆఫీసర్ విజయ్ కుమార్ అవగాహన కల్పించారు.
గూడూరు కోనేటిమిట్టలో వెలసి ఉన్న శ్రీ కోదండరామాంజనేయస్వామి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. స్వామి వారికి చక్రస్నానం కన్నుల పండువగా నిర్వహించారు.