ఈ తొమ్మిదినెల‌ల్లో ద‌ళితుల‌పై అక్ర‌మ కేసులు

భూ ఆక్ర‌మ‌ణ‌లు, పోలీసుల వేదింపులు

దళితుల‌పై పెట్టిన అక్ర‌మ కేసుల‌ను ఎత్తివేయాలి

అఖిల భార‌త రైతుకీల సంఘం

ఈ తొమ్మిదినెల‌ల్లో.. ద‌ళితుల‌పై అక్ర‌మ కేసులు
భూ ఆక్ర‌మ‌ణ‌లు, పోలీసుల వేదింపులు
దళితుల‌పై పెట్టిన అక్ర‌మ కేసుల‌ను ఎత్తివేయాలి

అఖిల భార‌త రైతుకీల సంఘం

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొమ్మిది నెలల్లో దళితులపై అక్రమ కేసులు, పోలీసుల వేధింపులు, భూ ఆక్రమణలు అధికార పార్టీ అండదండలతో యధేచ్ఛగా సాగుతున్నాయని, వాటిని అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైందని అఖిల భారత రైతు కూలీ సంఘం నెల్లూరు జిల్లా అద్యక్షుడు డీపీ పోలయ్య తెలిపారు.సైదాపురంలోని రెవెన్యూ కార్యాలయం వద్ద ఊటుకూరు గ్రామ దళితులతో కలిసి ధర్నా కార్యక్రమం చేపట్టారు. అనంత‌రం అధికారులకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా డీపీ పోలయ్య మాట్లాడుతూ.. దళితులపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తేసి.. భూములకు యాజమాన్య హక్కులు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కార్మిక సంఘాల నాయకులు రమేష్,మమత,సంపూర్ణమ్మ, వెంకట రమణమ్మ,నాగమణి, హరిబాబు, కోటయ్య, శ్రీను,చంటి, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *