ఎన్‌3 న్యూస్ బుల్లెట్స్‌

సంక్షిప్త వార్త మాలిక‌ నెల్లూరులో ఓ దళిత యువతి దారుణ హత్య కలకలం రేపుతోంది. రూరల్ పోలీసుస్టేషన్ ఎదుట కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళనకు దిగారు. నిందితుల్ని ఉరి తీయాలంటూ డిమాండ్ చేశారు. నెల్లూరులోని వీపీఆర్ నివాసంలో కోవూరు నియోజకవర్గం పరిధిలోని 23 మందికి రూ. 31,08,483 విలువ చేసే సీఎం సహాయ నిధి చెక్కులను ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి పంపిణీ చేశారు. నిరుపేదల ఆరోగ్య పరిరక్షణే కూటమి ప్రభుత్వ తొలి ప్రాధాన్యత ఇస్తుందని ఆమె తెలిపారు….

Read More

అధునాత‌న హంగుల‌తో అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్

సూళ్లూరుపేటలో ఈ నెల 18న అట్ట‌హాసంగా ప్రారంభం తక్కువ ఖర్చుతో అంద‌నున్న‌ కార్పొరేట్ కంటి వైద్యం వెన్నెల వెలుగు లాంటి కంటి చూపును ఇవ్వడమే ఉద్దేశం వివ‌రాలు వెల్ల‌డించిన అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్ నిర్వాహ‌కులు అధునాత‌న హంగుల‌తో అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్ వెన్నెల వెలుగు లాంటి కంటి చూపును ఇవ్వడమే త‌మ‌ ముఖ్య ఉద్దేశమని మెరికన్ లేజర్ ఐ హాస్పిటల్ నిర్వాహకులు తెలియ‌జేశారు. తిరుపతి జిల్లా సూళ్లూరుపేట పట్టణంలోని పోస్ట్ ఆఫీస్ కు సమీపంలో…

Read More

నేటి వార్త మాలిక

క‌ల్తీలేని వార్త‌లు-క‌ల‌క‌లం రేపే క‌థనాలు ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా బుధవారం ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. గాలుల ధాటికి రూరల్ మండలం గుడిపల్లిపాడులో రైస్ మిల్ కి చెందిన భారీ గోడ కుప్పకూలిపోయింది. ఆ సమయంలో రహదారిపై ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. పలు చోట్ల భారీ చెట్లు నేలకొరిగాయి. విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అమరావతిలోని ఏపీ మండలిలో ఎమ్మెల్సీగా బీద రవిచంద్ర యాదవ్ ప్రమాణ స్వీకారం చేశారు….

Read More

23 మందికి రూ. 31.08 లక్షలు పంపిణీ

నిరుపేదల ఆరోగ్య పరిరక్షణే కూటమి ప్రభుత్వ తొలి ప్రాధాన్యత లబ్ధిదారులకి సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి 23 మందికి రూ. 31.08 లక్షలు పంపిణీ అత్యవసర వైద్య అవసరాలకు పేదరికం అడ్డు రాకూడదన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆశయమని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి తెలిపారు. నెల్లూరు నగరం మాగుంట లేఅవుట్ లోని విపిఆర్ నివాసంలో ఆమె కోవూరు నియోజకవర్గ పరిధిలోని 23 మంది అనారోగ్య పీడితులకు…

Read More

అగ్ని ప్రమాదలపై ప్రజలు అవగాహన పెంచుకోవాలి

గూడూరులో అగ్నిమాపక శాఖ వారోత్సవాలు అగ్ని ప్రమాదలపై ప్రజలు అవగాహన పెంచుకోవాలి తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని రైల్వే స్టేషన్ లో అగ్నిమాపక శాఖ వారోత్సవాలను ఫైర్ ఆఫీసర్ విజయ్ కుమార్ నిర్వహించారు. ఈ సందర్భంగా అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రైల్వే సిబ్బందికి అవగాహన కల్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ…అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించామని తెలిపారు. ప్రజలందరూ అవగాహన పెంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్టేషన్ సూపర్డెంట్ వెంకటేశ్వరరావు జి…

Read More

నమ్మించాడు…బంగారంతో ఉడాయించాడు

ముద్దాయిని అరెస్ట్ చేసిన సంతపేట పోలీసులు నిందితుడి వద్ద రూ. 5.40 లక్షల విలువ చేసే 108 గ్రాముల బంగారం స్వాధీనం మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన రూరల్ డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసరావు నమ్మించాడు…బంగారంతో ఉడాయించాడు ఓ వ్యక్తిని నమ్మించి మోసం చేసి బంగారం తీసుకొని వెళ్లిపోయిన ముద్దాయిని సంతపేట పోలీసులు అరెస్ట్ చేశారని రూరల్ డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసరావు తెలిపారు. నిందితుడి వద్ద నుంచి రూ. 5.40 లక్షల విలువ చేసే 108 గ్రాముల బంగారం…

Read More

5 ఏళ్ల బాలిక ప్రాణాలను కాపాడిన మెడిక‌వ‌ర్‌ వైద్యులు

నెల్లూరు మెడిక‌వ‌ర్ హాస్పిట‌ల్‌లో అరుదైన చికిత్స విజయవంతం మీడియా సమావేశంలో మెడిక‌వ‌ర్ హాస్పిట‌ల్‌ వైద్యులు వెల్లడి 5 ఏళ్ల బాలిక ప్రాణాలను కాపాడిన మెడిక‌వ‌ర్‌ వైద్యులు నెల్లూరు మెడికవర్ హాస్పిటల్ లో 5 ఏళ్ల బాలికకు అతి క్లిష్ఠమైన అరుదైన ఆపరేషన్ నిర్వహించి ఆ బాలిక ప్రాణాలను కాపాడామని వైద్యులు వెల్లడించారు. శస్త్ర చికిత్స అనంతరం ఆ బాలిక పూర్తిగా కోలుకుందన్నారు. దీనిపై నెల్లూరులోని మెడిక‌వ‌ర్‌ హాస్పిటల్ లో పల్మనాలజిస్ట్ డాక్టర్ కాటంరెడ్డి కౌశిక్ రెడ్డి మీడియా…

Read More

ఆరు నెలలు గడవక ముందే…

నెల్లూరులో కలకలం రేపుతున్న వివాహిత‌ దారుణ హత్యకు రూరల్ పోలీసుస్టేషన్ ఎదుట ఆందోళనకు దిగిన కుటుంబ సభ్యులు, బంధువులు ఆరు నెలలు గడవక ముందే… నెల్లూరులో ఓ యువతి దారుణ హత్య కలకలం రేపుతోంది…పెళ్లి అయి ఆరు నెలలు గడవక ముందే…తన కూతురిని అల్లుడు, వారి కుటుంబ సభ్యులే చంపేశారని…యువతి తల్లిదండ్రులు బోరున విలపించారు. తన కుమార్తెకి న్యాయం జరగాలని.. హత్యకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలంటూ… నెల్లూరురూరల్ పోలీసుస్టేషన్ ఎదుట కుటుంబ సభ్యులు, బంధువులు పెద్ద…

Read More

అల్లూరులో భారీ వర్షం

తీవ్ర అవ‌స్థ‌లు ప‌డ్డ వ్యాపారులు ఎండ‌కు ఉప‌శ‌మ‌నం పొందిన ప్ర‌జ‌లు అల్లూరులో భారీ వర్షం నెల్లూరు జిల్లా అల్లూరులో భారీ ఉరుములు ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. దాదాపు గంటసేపు కురిసిన వర్షానికి అల్లూరు ప్రధాన రహదారి నీట మునిగింది. దీంతో చిరు వ్యాపారులు, పాదాచారులు తీవ్ర అవస్థలు ఎదుర్కొన్నారు. గత రెండు నెలలుగా కాస్తున్న తీవ్ర ఎండలకు ప్రస్తుతం వర్షం కొనడంతో మండల ప్రజలు కాస్త ఉపశమనం పొందారు.

Read More

పెంచలకోనలో 53 షాపుల‌కు వేలంపాట

వేలంపాట నిర్వ‌హించిన ఆల‌య ఈవో పోరెడ్డి శ్రీ‌నివాసులురెడ్డి పెంచలకోనలో 53 షాపుల‌కు వేలంపాట నెల్లూరు జిల్లా రాపూరు మండలం ప్రాముఖ్య పుణ్యక్షేత్రమైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో తాత్కాలిక 53 షాపుల‌కు వేలంపాట నిర్వ‌హించారు. మే నెలలో జరగబోవు శ్రీ లక్ష్మి నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు సందర్భంగా దేవస్థానం EO పోరెడ్డి శ్రీనివాసులు రెడ్డి ఆధ్వర్యంలో వేలంపాట జ‌రిగింది. వ్యాపారస్తులు 3000 రూపాయ‌లు రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించి వేలంపాట‌లో పాల్గొని షాపులను దక్కించుకున్నారు. ఈ కార్యక్రమంలో పెంచలకోన…

Read More