13 ఏళ్ళ షుగర్ ఫ్యాక్టరీ సమస్యకు పరిష్కారం సాధించాం

ఐదేళ్లుగా తట్టెడు మట్టి వేయని గ్రామీణ రోడ్ల రూపు రేఖలు మార్చాం

కోవూరులో కైలాసభూమి రోడ్డుని ప్రారంభించిన ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి

13 ఏళ్ళ షుగర్ ఫ్యాక్టరీ సమస్యకు పరిష్కారం సాధించాం

  • ఐదేళ్లుగా తట్టెడు మట్టి వేయని గ్రామీణ రోడ్ల రూపు రేఖలు మార్చాం
  • ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి
  • కోవూరులో కైలాసభూమి రోడ్డుని ప్రారంభించిన ఎమ్మెల్యే

కూటమి ప్రభుత్వం అధికారంలోనికి వచ్చాక కోవూరు గ్రామాభివృద్ధి కోసం 2 కోట్ల రూపాయలకు పైగా నిధులు వెచ్చించామని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి తెలిపారు. ప్రజా ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమంలో భాగంగా ఆమె కోవూరు గ్రామానికి విచ్చేశారు. ఎమ్మెల్యేకి కూటమి నాయకులు, కార్యకర్తలు ప్రజలు బ్రహ్మరధం పట్టారు. ఈ సందర్భంగా ఆమె 25 లక్షల వ్యయంతో నిర్మించిన కైలాసభూమి రోడ్డు ప్రారంభోత్సవం చేశారు. కోనేటి కయ్యలు ప్రాంతంలో 8,9 వార్డులలో పర్యటించిన ఆమె ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్నారు. స్థానిక సమస్యలను ప్రజలు ఆమె దృష్టికి తెచ్చారు. ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి మాట్లాడుతూ… కోనేటి కయ్యల ప్రాంతంలో శిథిలావస్థకు చేరిన ఆయుర్వేద ఆసుపత్రి పునర్నిర్మిచేందుకు కృషి చేస్తానన్నారు. 13 సంవత్సరాలుగా అపరిష్కృతంగా వున్న కోవూరు షుగర్ ఫ్యాక్టరీ రైతులు, కార్మికుల సమస్యకు త్వరలోనే పరిష్కారం దొరుకుతుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో కోవూరు పంచాయతి రాజ్ ఎఇ శ్రీనివాసులు, తహసీల్దార్ నిర్మలానంద బాబా పెన్నాడెల్టా చైర్మన్ జెట్టి రాజగోపాలరెడ్డి, ఎంపిపి పార్వతి, టిడిపి మండల పార్టీ అధ్యక్షులు ఇంతా మల్లారెడ్డి, స్థానిక నాయకులు గాదిరాజు అశోక్, బాల రవి, పిచ్చుక మధు, తిరుమూరు అశోక్ రెడ్డి, నల్లపరెడ్డి సురేష్ రెడ్డి, జనసేన నాయకులు చప్పిడి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *