రెండు నెలల్లో ఆటో నగర్ పూర్తి చేస్తా

కొట్టాలు గ్రామంలో ఆటో నగర్ కు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి

హర్షం వ్యక్తం చేసిన ఆటో యూనియన్ నేతలు

రెండు నెలల్లో ఆటో నగర్ పూర్తి చేస్తా…

  • కొట్టాలు గ్రామంలో ఆటో నగర్ కు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి
  • హర్షం వ్యక్తం చేసిన ఆటో యూనియన్ నేతలు

సీఎం చంద్రబాబు నాయుడు అడుగులు ఎప్పుడూ అభివృద్ధి వైపే ఉంటాయనీ కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అన్నారు…నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం నాగమాంబాపురం పంచాయతి పరిధిలోని కొట్టాలు గ్రామంలో
ఏడు ఎకరాల ముప్పై సెంట్ల భూమిని ఆటోనగర్ కు కేటాయించారు. ఈ సందర్భంగా ఆమె స్థానిక నేతలు, కార్యకర్తలు, ఆటో యూనియన్ నాయకులతో కలిసి…భూమి పూజ చేశారు. గ్రామానికి విచ్చేసిన ఎమ్మెల్యేకి ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే
ప్రశాంతిరెడ్డి మాట్లాడుతూ.. ఆటో నగర్ ఏర్పాటు చేయాలనీ ఎన్నికల ముందు విన్నపాలు వచ్చాయనీ.. నాడు ఇచ్చిన హామిను నెరవేరుస్తున్నట్లు చెప్పారు..రెండు నెలల్లో ఆటో నగర్ పూర్తి చేస్తామనీ చెప్పడంతో ఆటో యూనియన్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు..ముఖ్యంగా నిరుద్యోగ యువతకి ఉపాధి అవకాశాలు కల్పించి…వారికి ఓ దారి చూపిస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, ఆటో యూనియన్ నాయకులు, కార్మికులు, ప్రజలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *