గుడిపల్లిపాడులో కుప్ప కూలిన రైస్ మిల్ భారీ గోడ
ట్రాఫిక్ ని మళ్లించిన పోలీసులు_
నెల్లూరులో తప్పిన పెను ప్రమాదం…
- గుడిపల్లిపాడులో కుప్ప కూలిన రైస్ మిల్ భారీ గోడ
- ట్రాఫిక్ ని మళ్లించిన పోలీసులు
నెల్లూరులో బుధవారం ఉదయం వాతావరణంలో ఒక్క సారిగా మార్పు చోటు చేసుకుంది. భారీ ఈదురు వీచాయి. వీటి ధాటికి రూరల్ మండలం గుడిపల్లిపాడులోని రైస్ మిల్ కి చెందిన భారీ గోడ కుప్ప కూలి రహదారిపై పడిపోయింది. గోడ కూలిన సమయంలో వాహనదారులు, ప్రజలు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు వాపోయారు. దీంతో కొత్త కోడూరు రహదారిపై ట్రాఫిక్ స్తంభించిపోయింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని…ట్రాఫిక్ ని నియంత్రించేందుకు వాహనాలను చిన్న చెరుకూరు మీదుగా మళ్లించారు.