దొంగతనాలు అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు
ప్రజలందరూ LHMS సిస్టమ్ ని వినియోగించుకోవాలి
మీడియా సమావేశంలో కోవూరు సీఐ సుధాకర్ రెడ్డి
వేసవిలో జర జాగ్రత్త…
- దొంగతనాలు అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు
- ప్రజలందరూ LHMS సిస్టమ్ ని వినియోగించుకోవాలి
- మీడియా సమావేశంలో కోవూరు సీఐ సుధాకర్ రెడ్డి
కోవూరులోని సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో సీఐ సుధాకర్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… వేసవికాలంలో దొంగతనాలు జరగకుండా ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని తెలిపారు. మీ ఇళ్లల్లో మీరు లేని సమయంలో దొంగల బారిన పడకుండా పోలీసు వారిచే ఎల్ హెచ్ ఎం ఎస్ అనే సిస్టంను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. దీనిని పట్టణ ప్రజలు ఉపయోగించుకోవాలని ఆయన కోరారు. ప్రజలు తమ మొబైల్ లోని ప్లే స్టోర్ నుండి ఎల్ హెచ్ ఎం ఎస్ అనే యాప్ ని డౌన్లోడ్ చేసుకొని మీ ఇళ్లను దొంగల బారిన పడకుండా కాపాడుకోవాలని విజ్ఞప్తి చేశారు. మీరు ఎక్కడికైనా వెళ్లేటప్పుడు పోలీసు వారికి సమాచారం అందించాలని కొత్త వ్యక్తులు ఎవరైనా కనిపిస్తే తెలియజేయాలని కోరారు…ఈ కార్యక్రమంలో ట్రైనీ డిఎస్పి శివ ప్రియ , స్టేషన్ రైటర్ రషీద్ తదితరులు పాల్గొన్నారు….