కలువాయిలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు
అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించిన ప్రజా ప్రతినిధులు, అధికారులు, ఎమ్మార్పీఎస్ నాయకులు
రాజ్యాంగ నిర్మాత అడుగుజాడల్లోనే నడుద్దాం…
- కలువాయిలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు
- అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించిన ప్రజా ప్రతినిధులు, అధికారులు, ఎమ్మార్పీఎస్ నాయకులు
నెల్లూరు జిల్లా కలువాయిలో అంబేద్కర్ 134వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. బస్టాండ్ సెంటర్ లోని అంబేద్కర్ విగ్రహానికి… ప్రజా ప్రతినిధులు, ఎమ్మార్పీఎస్ నాయకులు, అధికారులు పూలమాలలు నివాళులర్పించారు. అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని… ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సబ్ బ్రాంచ్ చైర్మన్ జి పెంచలపుల్లయ్య ఆధ్వర్యంలో జడ్పీ హైస్కూల్ నందు రక్త దాన శిభిరం ఏర్పాటు చేశారు.. ఈ సందర్భంగా అంబేడ్కర్ విగ్రహన్ని నిర్మించడానికి కృషి చేసినటువంటి మాజీ సర్పంచ్ పత్తూరి సరోజ దంపతులను.. ఏడిపిఎస్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నిజమాల ప్రసాద్ సన్మానించారు. వెంకటగిరి నియోజకవర్గం బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఎస్ఎస్ఆర్ నాయుడు, మండల సీనియర్ నాయకులు దండు పెంచలయ్య ఆధ్వర్యంలో పేదలకు అన్నదాన చేశారు. కార్యక్రమంలో ఎస్ఐ సుమన్, అంబేద్కర్ ధర్మ పోరాట సమితి సభ్యులు, కూటమి నాయకులు, అభిమానులు,డాక్టర్ రాజేష్,తదితరులు పాల్గొన్నారు..