బడుగు బలహీనవర్గాల ఆశాజ్యోతి అంబేడ్కర్
కృష్ణారెడ్డిపాలెంలో అంబేడ్కర్ విగ్రహం ఆవిష్కరించిన సీఐ వెంకటనారాయణ
విగ్రహ ఏర్పాటుకు సహకరించిన తెలంగాణ ప్రాంతానికి చెందిన అనుపమ పరమేశన్
బడుగు బలహీనవర్గాల ఆశాజ్యోతి అంబేడ్కర్
- కృష్ణారెడ్డిపాలెంలో అంబేడ్కర్ విగ్రహం ఆవిష్కరించిన సీఐ వెంకటనారాయణ
- విగ్రహ ఏర్పాటుకు సహకరించిన తెలంగాణ ప్రాంతానికి చెందిన అనుపమ పరమేశన్
నెల్లూరు జిల్లా కలిగిరి మండలం కృష్ణారెడ్డి పాలెంలో భారతరత్న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ కార్యక్రమం జరిగింది. గడ్డం రంజాన్ తెలంగాణ ప్రాంతానికి చెందిన అనుపమ పరమేశన్ ను నూతన అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుకు సాయం కోరగా తక్షణమే విగ్రహ ఏర్పాటుకు లక్ష ఇరవై ఐదు వేల రూపాయలు నగదు ఇచ్చి ఆమె దాతృత్వాన్ని చాటుకున్నారు. అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ విగ్రహాన్ని ఆయన జయంతి రోజు కలిగిరి సీఐ వెంకటనారాయణ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ చేయడం సంతోషంగా ఉందన్నారు. దేశానికి రాజ్యాంగాన్ని రచించి దిశా దశ సూచించిన మహనీయుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని కొనియాడారు.