రూ. 30వేల నష్టం
బోరున విలపిస్తోన్న రైతు పెసల శంకరయ్య
విడవలూరులో ఘటన
పది ఎకరాల గడ్డివాము దగ్ధం…
- రూ. 30వేల నష్టం
- బోరున విలపిస్తోన్న రైతు పెసల శంకరయ్య
- విడవలూరులో ఘటన
నెల్లూరు జిల్లా విడవలూరు మండలం దంపూరు గ్రామంలో పెసల శంకరయ్య అనే రైతుకి చెందిన పది ఎకరాల గడ్డివాము అగ్నికి దగ్ధమైంది. గమనించిన బాధిత రైతు, స్థానికులు మంటలను అదుపు చేశారు. అప్పటికే గడ్డివాము దగ్ధమైపోయిందని శంకరయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ… ఉదయం గడ్డివాము వేస్తే…ఏం జరిగిందో తెలియదని మధ్యాహ్నం 3 గంటల సమయంలో గడ్డివాములు మంటలు చెలరేగి కాలిపోయిందన్నారు. సుమారు రూ. 30వేల నష్టం వాటిల్లిందని వాపోయారు. ఎమ్మెల్యే ప్రశాంతమ్మ స్పందించి సాయం చేసి ఆదుకోవాలని ఆయన వేడుకున్నారు. గ్రామ సర్పంచ్ సురేందర్ రెడ్డి మాట్లాడుతూ…గడ్డివాము తగులుకున్న వెంటనే 101 ద్వారా ఫైర్ సిబ్బందికి తెలియజేసినప్పటికీ నెల్లూరు నుంచి రావడం ఆలస్యం కావడంతో గడ్డివాము పూర్తిగా దగ్గమైందన్నారు. ఫైర్ స్టేషన్ అనేది పది కిలోమీటర్ల దగ్గర్లో ఉంటే ఇలాంటి సమయాల్లో సహాయ పడుతుందని దీనిపై ఎమ్మెల్యే స్పందించి బాధిత రైతుకి తగు న్యాయం చేయాలని కోరారు.