ఆకట్టుకున్న కీలు గుర్రాలు, మేళాలు, తీర్మాన్
జూన్ లో నారావారిపల్లె నుంచి ఎస్టీ వర్గీకరణ సాధన యాత్ర
ఆవిర్భావ సభలో యానాది రిజర్వేషన్ పోరాట సమితి అధ్యక్షులు కేసీ పెంచలయ్య
నెల్లూరులో భారీ ర్యాలీ…
- ఆకట్టుకున్న కీలు గుర్రాలు, మేళాలు, తీర్మాన్
- జూన్ లో నారావారిపల్లె నుంచి ST వర్గీకరణ సాధన యాత్ర
- ఆవిర్భావ సభలో యానాది రిజర్వేషన్ పోరాట సమితి అధ్యక్షులు కేసీ పెంచలయ్య
ST వర్గీకరణ సాధన యాత్ర కోసం… యానాది రిజర్వేషన్ పోరాట సమితి అధ్యక్షులు కేసీ పెంచలయ్య ఆధ్వర్యంలో నెల్లూరులో ఆవిర్భావ సభ జరిగింది. ఈ సందర్భంగా నగరంలోని వెన్నెలకంటి రాఘవయ్య భవన్ నుంచి టౌన్ హాల్ వరకూ భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ లో కీలుగుర్రాల ఆటలు, డుబాంకు మేళం, తీన్మార్ ప్రత్యేక ఆకర్షణ గా నిలిచాయి. ఆనంతరం టౌన్ హాల్ లో సభ జరిగింది సభలో కెసి పెంచలయ్య యానాది మాట్లాడారు. రాష్ట్రంలోఎస్టీల వర్గీకరణ కు ప్రభుత్వం చర్యలు చేపట్టి యానాదులకు న్యాయం చేయాలన్న ఉద్దేశంతోనే సభ ఏర్పాటు చేశామన్నారు. రాష్ట్రంలో 37 లక్షల గిరిజన జనాభాలో 10 లక్షలు యానాది జనాభా 30% ముందంజలో ఉందని తెలిపారు. ఆర్థికంగా రాజకీయంగా సామాజికపరంగా వెనుకబడి ఉందని అందుకు ప్రత్యేక వర్గీకరణ అవసరమని పేర్కొన్నారు. కార్యక్రమంలో సమితి నాయకులు, ఎస్టీలు పాల్గొన్నారు.