కావలి పట్టణంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు

అంబేద్కర్ విగ్రహాలకు, చిత్ర పటాలకు ఘన నివాళులు

అంబేద్కర్ ఆశయ సాధనకు అందరూ కృషి చేయాలని వక్తల పిలుపులు

ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు

  • కావలి పట్టణంలో అంబేద్కర్ విగ్రహాలకు, చిత్ర పటాలకు ఘన నివాళులు
  • అంబేద్కర్ ఆశయ సాధనకు అందరూ కృషి చేయాలని వక్తల పిలుపులు

కావలి పట్టణంలో అంబేద్కర్ 134 జయంతిని రాజకీయ పార్టీల నేతలు, దళిత సంఘాలు, ప్రభుత్వ కార్యాలయాల్లో ఘనంగా జరుపుకున్నారు. ట్రంక్ రోడ్డులోని బ్రిడ్జి సెంటరులో, తుమ్మలపెంట బస్టాండ్ లోని పార్కులో, ముసునూరులో, ఇందిరా నగర్ లోని అంబేద్కర్ విగ్రహాలకు నివాళులు అర్పించారు. బీజేపీ , కాంగ్రెస్, ఎం.అర్.పి.ఎస్ , మాల ఉద్యోగ సంఘాల జేఏసీ దళిత సంఘాల నాయకులు, ఎమ్మెల్యే కావ్వ కృష్ణారెడ్డిలు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏరియా వైద్యశాలలో అన్నదాన కార్యక్రమం చేసారు. ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి మీడియా తో మాట్లాడారు. ఆయన వెంట పట్టణ అధ్యక్షుడు గుత్తికొండ కిషోర్, ప్రధాన కార్యదర్శి జ్యోతి బాబురావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మలిశెట్టి వెంకటేశ్వర్లు, మొగిలి కల్లయ్య, మాజీ మున్సిపల్ చైర్మన్ అలేఖ్య, మహిళా పట్టణ అధ్యక్షురాలు ఆర్షియా బేగం , నాయబ్ రసూల్, తలపనేని ప్రభాకర్, శానం హరి తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా 5వ వార్డు టిడిపి నాయకులు జనీగర్ల మనోహర్ ఆధ్వర్యంలో కుక్కలగుంట బాడువ కృష్ణుడి బొమ్మ వద్ద చలివెంద్రం ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా రాష్ట్ర లీగల్ ఉపాధ్యక్షులు పొట్లూరి శ్రీనివాసులు, పట్టణ ప్రధాన కార్యదర్శి జ్యోతి బాబురావు, జనీగర్ల మనోహర్ మాట్లాడారు. వారి వెంట దాసరి రవి, జనిగర్ల మనోజ్ , ఉప్పాల శ్రీనివాసులు , సన్నీ బో యిన కమల్ ,దేవరాల సురేష్ , సోమిశెట్టి ఉమా , మద్దూరి కృష్ణ , సాయి బొంత తదితరులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *