సంక్షిప్త వార్త మాలిక
ఆంధ్రప్రదేశ్ లో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని తిరుపతి ఎంపీ గురుమూర్తి ఆరోపించారు. నెల్లూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో కూటమి పాలనపై ఆయన ఫైర్ అయ్యారు.
కలువాయిలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. స్వామి, అమ్మవార్ల గ్రామోత్సవం కన్నుల పండువగా సాగింది.
ఇంటర్ ఫలితాల్లో పొదలకూరులోని ఓ ప్రైవేట్ కళాశాలకి చెందిన ప్రహ్లాద్ కుమార్ 988 మార్కులు సాధించి సత్తా చాటాడని కళాశాల యాజమాన్యం పేర్కొంది. కళాశాల మేనేజింగ్ డైరెక్టర్, చైర్మన్, ఉపాధ్యాయులు విద్యార్థిని అభినందించి సత్కరించారు.
సంగంలోని సంగమేశ్వరుడి ఆలయంలో బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. స్వామి, అమ్మవార్ల కళ్యాణాన్ని వేద పండితులు కన్నుల పండువగా నిర్వహించారు.
ఛలో నెల్లూరు యానాది వర్గీకరణ కోసం రాపూరు మండలం నుంచి సుమారు 300 మంది నెల్లూరుకు పయనమయ్యారు. ఎస్టీ ప్రత్యేక వర్గీకరణ జరగాలని వారు డిమాండ్ చేశారు.
పొదలకూరులోని నెల్లూరు రోడ్డులో మోటారు బైక్ ని లారీ ఢీకొట్టింది. ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందగా..మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
గూడూరులోని కోనేటిమిట్టలో వెలసి ఉన్న కోదండ రామాంజనేయస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో ఎమ్మెల్యే పాశిం సునీల్ కుమార్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.
రాపూరులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రహదారిపైనే నిలబడి ఉన్న వ్యవసాయ కూలీలను కారు అతివేగంగా వచ్చి ఢీకొట్టింది. ప్రమాదంలో ఇద్దరు స్పాట్ లోనే మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు