కావలిలో మీడియా సమావేశంలో కూటమి ప్రభుత్వంపై మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి ఫైర్
ఇంటింటికి ఎమ్మెల్యే కార్యక్రమంలో సమస్యలు చెప్పుకునే ప్రజలకు ఆంక్షలు ఏమిటని ప్రశ్న
సూపర్ సిక్స్ పథకాలు ఏవీ..?
- కావలిలో మీడియా సమావేశంలో కూటమి ప్రభుత్వంపై మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి ఫైర్
- ఇంటింటికి ఎమ్మెల్యే కార్యక్రమంలో సమస్యలు చెప్పుకునే ప్రజలకు ఆంక్షలు ఏమిటని ప్రశ్న
సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తామని ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చాక పథకాలు అమలు చేయలేమని పది నెలలకే చేతులెత్తేసిన ఘనత కూటమి ప్రభుత్వానిది అని కావలి మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి ఎద్దేవ చేశారు.
కావలిలో ఆయన మీడియాతో మాట్లాడారు. కావలిలో ఇంటింటి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి కార్యక్రమంపై మాజీ ఎమ్మెల్యే విమర్శలు చేశారు. ఎవరు గత ప్రభుత్వంలో ఇచ్చిన పథకాల గురించి అడగకూడదని, గ్రూపులుగా వచ్చి సమస్యలు చెప్పకూడదని, ఏదైనా అర్జీ రూపంలో సమస్య చెప్పాలని ఆంక్షలు విధించడం ఏమిటో అర్థం కావడంలేదన్నారు. ఈ కార్యక్రమంలో కనమర్లపూడి నారాయణ, వీర రాఘవులు, సన్నిబోయిన ప్రసాద్, మాజీ కౌన్సిలర్లు గంధం ప్రస న్నాంజనేయులు, రాజా, నాయకులు వెంకటేశ్వర్లురెడ్డి , దామిశెట్టి సుధీర్ నాయుడు , నాయబ్ రసూల్, చందు, మధు తదితరులు ఉన్నారు.